News November 19, 2025
GWL: ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోండి- నుషిత

గద్వాల జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువే ఎస్సీ విద్యార్థుల నుంచి ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి నుషిత మంగళవారం పేర్కొన్నారు. కొత్త పథకం కింద 5 నుంచి 8వ తరగతి విద్యార్థులు, రాజీవ్ విద్యా దీవెన పథకం కింద 9,10వ తరగతి విద్యార్థులు డిసెంబర్ 31లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ ఖాతా ఆధార్ తో లింక్ చేసుకోవాలన్నారు.
Similar News
News March 17, 2026
ఈనెల 27న భద్రాచలానికి సీఎం రేవంత్

భద్రాచలంలో ఈ నెల 27న జరిగే రాములోరి కళ్యాణానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఉగాది రోజున బ్రహ్మోత్సవ సందడి ప్రారంభం కానుండగా.. అదేరోజు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ దంపతులను నవమి వేడుకలకు ఆహ్వానించనున్నారు. రూ.300 కోట్లతో ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయగా, తొలి విడతలో రూ.100 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని మంత్రి తుమ్మల వెల్లడించారు.
News March 17, 2026
ఈ ప్రభుత్వానికి ఎందుకు ధన్యవాదాలు చెప్పాలి: KTR

TG: అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రభుత్వంపై KTR విమర్శలు గుప్పించారు. ‘ఎవరు, ఎందుకు ధన్యవాదాలు చెప్పాలి? పెన్షన్ల పెంపు కోసం ఎదురు చూస్తున్నవారా? యూరియా బస్తాల కోసం లాఠీ దెబ్బలు తింటున్న రైతులా? నెలకు రూ.2500 కోసం వేచి చూస్తున్న ఆడబిడ్డలా? బెనిఫిట్స్ అందని ఉద్యోగులు, పెన్షన్దారులు, పురుగుల అన్నం తింటున్న విద్యార్థులు ధన్యవాదాలు చెప్పాలా’ అని ధ్వజమెత్తారు.
News March 17, 2026
ALERT: ఇలా చేస్తే అకౌంట్లలోకి రూ.6,000

TG: ఈ నెల 22న ప్రభుత్వం తొలి విడత రైతు భరోసా <<19392898>>నిధులు<<>> విడుదల చేయనుంది. 2026 FEB 28లోపు కొత్త పట్టాదారు పాస్బుక్స్ పొందినవారు పెట్టుబడి సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. పాస్బుక్, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలతో వ్యవసాయ విస్తరణ అధికారిని కలిసి దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి సమర్పించాలి. అధికారులు పరిశీలించి అర్హుల జాబితాలో చేరుస్తారు. దాన్ని బట్టి ప్రభుత్వం రూ.6,000 ఖాతాల్లో జమ చేస్తుంది.


