News November 19, 2025
రైతు అభివృద్ధే లక్ష్యం: మార్నేని రవీందర్

హనుమకొండ డీసీసీబీ బ్యాంకులో 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ స్నేహ శబరీష్, అపెక్స్ బ్యాంక్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్యాక్స్(PACS) లను సాధారణ సేవా కేంద్రాలుగా అభివృద్ధి చేసి, గ్రామీణ ప్రజలకు స్థిర జీవనోపాధి కల్పించడమే సహకార రంగం లక్ష్యమని వారు పేర్కొన్నారు.
Similar News
News March 22, 2026
ముదిగుబ్బ: ప్రమాదంలో వ్యక్తి స్పాట్డెడ్

ముదిగుబ్బ మండలం దొరిజిగిల్లు గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. పుట్టపర్తిలోని సమాధి రోడ్డులో ఉండే రాము (50) బైక్పై వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో అతను మృతి చెందాడు. మృతుడిని 108లో ముదిగుబ్బ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 22, 2026
ఉస్తాద్ భగత్సింగ్ టికెట్ రేట్స్ తగ్గింపు

AP: పవర్స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్సింగ్ సినిమా టికెట్ ధరలు రాష్ట్రంలో రేపటి నుంచి తగ్గనున్నాయి. ఉగాదికి రిలీజైన ఈ మూవీకి 10రోజుల పాటు హైక్కు ప్రభుత్వం అనుమతించింది. అయితే TGతో సమానంగా ధరలను ఉంచేందుకు మేకర్స్ రేపటి నుంచే తగ్గించాలని డిసైడ్ అయ్యారు. టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్స్లో ₹100, మల్టీప్లెక్స్లలో ₹125 తగ్గనున్నాయి. దీంతో థియేటర్లకు వచ్చే ఆడియన్స్ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
News March 22, 2026
కోనసీమ జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు

జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో శనివారం ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని ఎస్సైలు పోలీస్ సిబ్బంది ప్రధాన కూడళ్లలో తనిఖీలు చేపట్టి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా వాహనాలు నడుపుతున్న మైనర్లను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మద్యం సేవించి వాహనం నడుపుతున్న వ్యక్తులకు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.


