News November 17, 2025

Wow.. సిద్దిపేట నుంచి ఇండియా టీంకు

image

అక్బర్‌పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన పోతనక అభిలాష్ డాడ్జ్‌బాల్ భారత జట్టుకు ఎంపికయ్యాడు. సిద్దిపేట నుంచి జిల్లా స్థాయికి, జాతీయ స్థాయికి ఎదిగిన అభిలాష్.. క్రికెట్‌తో సహా ఇతర క్రీడల్లోనూ చురుకైన పాత్ర పోషించేవాడు. దేశంలోని వివిధ రాష్ట్రాల క్రీడాకారులతో జరిగిన టెస్టులో మెరుగైన ప్రతిభ కనబరిచి జాతీయ జట్టులో సుస్థిర స్థానం సంపాదించిన అతడిని జిల్లా వాసులు అభినందిస్తున్నారు.

Similar News

News November 17, 2025

ఆన్‌లైన్ మోసాలపై పోలీసుల సూచనలివే..

image

సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ పోలీసులు సూచించారు. తెలియని కాల్స్, ఇమెయిల్స్, మెసేజ్‌లను నమ్మవద్దని హెచ్చరించారు. బ్యాంకు సిబ్బంది ఎప్పుడూ OTP, PIN, CVV అడగరని తెలిపారు. అనుమానాస్పద లింకులు ఓపెన్ చేయొద్దన్నారు. TeamViewer, AnyDesk వంటి రిమోట్ యాప్‌లు ఇన్స్టాల్ చేయవద్దని సూచించారు. ఒక్క నిర్లక్ష్యంతో పెద్ద నష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

News November 17, 2025

ఆన్‌లైన్ మోసాలపై పోలీసుల సూచనలివే..

image

సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ పోలీసులు సూచించారు. తెలియని కాల్స్, ఇమెయిల్స్, మెసేజ్‌లను నమ్మవద్దని హెచ్చరించారు. బ్యాంకు సిబ్బంది ఎప్పుడూ OTP, PIN, CVV అడగరని తెలిపారు. అనుమానాస్పద లింకులు ఓపెన్ చేయొద్దన్నారు. TeamViewer, AnyDesk వంటి రిమోట్ యాప్‌లు ఇన్స్టాల్ చేయవద్దని సూచించారు. ఒక్క నిర్లక్ష్యంతో పెద్ద నష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

News November 17, 2025

ములుగు: డబ్బుల కోసం జరిగిన గొడవలోనే సమ్మయ్య హత్య

image

డబ్బుల కోసం జరిగిన గొడవలోనే సమ్మయ్య హత్యకు గురైనట్లు ములుగు సీఐ సురేశ్ తెలిపారు. ములుగు మండలం లాలాయిగూడెంలో ఎలక్ట్రిషన్ సమ్మయ్య హత్యకు గురైన విషయం తెలిసిందే. సీఐ తెలిపిన వివరాలు.. ఇదే గ్రామానికి చెందిన సల్లూరి పవిత్ర సమ్మయ్యకు డబ్బులు ఇవ్వాలి. ఈ విషయమై వచ్చిన అతడితో పవిత్ర, ఆమె తాత సాంబయ్య, మరో మహిళ అనసూయ గొడవ పడి చంపేశారు. మృతుడి సోదరుడు నాగరాజు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.