News April 12, 2024
అప్పట్లో కమ్యూనిస్టుల హవా!.. 1/2

AP: ప్రస్తుతం ఉనికి కోసం ప్రయత్నిస్తున్న కమ్యూనిస్టులు ఒకప్పుడు హంగ్ ఏర్పడేలా సీట్లు సాధించి ప్రభంజనం సృష్టించారు. స్వాతంత్ర్యం అనంతరం 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఆంధ్రా ప్రాంతంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ 41, కాంగ్రెస్ 40 స్థానాల్లో గెలిచాయి. అప్పటికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడలేదు.. సంయుక్త మద్రాసులో భాగంగా ఉండేది. అయితే ప్రకాశం పంతులు నేతృత్వంలోని KMPP సాయంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News March 10, 2026
సల్మాన్ మూవీలో హీరోయిన్గా సమంత?

సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కబోయే సూపర్ హీరో ఫిల్మ్లో సమంత హీరోయిన్గా నటించే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. రాజ్&డీకే ద్వయం ఈ మూవీని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో హ్యూమర్+యాక్షన్ ఉంటుందని సమాచారం. కాగా డైరెక్టర్ల ద్వయంలో ఒకరైన రాజ్ను సామ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ‘మా ఇంటి బంగారం’ సినిమాతో పాటు ‘రక్త బ్రహ్మాండ్’ వెబ్ సిరీస్లో నటిస్తున్నారు.
News March 10, 2026
యుద్ధం.. పడిపోతున్న బియ్యం ధరలు

మిడిల్ ఈస్ట్లో యుద్ధం వరి రైతులపైనా ప్రభావం చూపుతోంది. చెన్నై పోర్టు నుంచి ఆఫ్రికన్ దేశాలకు బియ్యం ఎగుమతులు ఆగిపోగా, ఇప్పటికే బయల్దేరిన కంటైనర్లూ వెనక్కి వచ్చేశాయి. దీంతో వారం కిందటి వరకు పుట్టి(850KG) ధాన్యం ధర ₹22,500 ఉండగా ప్రస్తుతం ₹21Kకు పడిపోయింది. ఇంకొన్ని రోజులు ఎక్స్పోర్ట్స్ నిలిచిపోతే రేట్లు మరింత పతనం కానున్నాయి. అలాగే $11.8Bn విలువైన ఆహారోత్పత్తుల ఎగుమతులపైనా ప్రభావం పడనుందని అంచనా.
News March 10, 2026
ఫైళ్ల దహనం వెనకున్న ప్లాన్ ఏంటో తేలాలి: సుప్రీంకోర్టు

AP: మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన ఫైళ్ల దహనం తీవ్రమైన నేరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రికార్డు రూమ్లో మంటలు ఎలా అంటుకున్నాయి? దాని వెనకున్న ప్లాన్ ఏంటో లోతుగా విచారించాల్సి ఉందని తెలిపింది. ఈ కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి సహా ఇతర నిందితుల ముందస్తు బెయిల్కు నిరాకరించింది. ఘటన సమయంలో నిందితుడు విదేశాల్లో ఉన్నారనే కారణంతో విచారణ నుంచి తప్పించుకోలేరని పేర్కొంది.


