News November 19, 2025

పాఠశాల్లో కూడా ముస్తాబును నిర్వహించాలి: కలెక్టర్

image

విద్యార్థుల ముస్తాబు కార్యక్రమం మాదిరిగా ఇకపై పాఠశాలల ముస్తాబు కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. మంగళవారం పార్వతీపురం GJ కళాశాల సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రధానోపాధ్యాయులతో జిల్లా స్థాయి సమీక్షాసమావేశాన్ని నిర్వహించారు. ప్రతి పాఠశాలలో దీన్ని ఖచ్చితంగా ఆచరించాలని, పాఠశాల ప్రాంగణంలో చెత్త లేకుండా పరిశుభ్ర వాతావరణం కనిపించాలన్నారు.

Similar News

News March 18, 2026

ఉగాది పండుగకు ఇందూర్ సిద్ధం..!

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉగాది పండుగ అటు భక్తిని, ఇటు గ్రామీణ సాహస క్రీడలను కలబోసిన వేడుకలా నిలుస్తోంది. మాక్లూర్ మండలం ఓడ్డేట్‌పల్లిలో ఒడ్డేటమ్మ తల్లి జాతరతో భక్తులు పులకించిపోతుంటే, పల్లెల్లో కళాకారుల జడ కొప్పులాట, కుస్తీ పోటీలు పాతకాలపు వైభవాన్ని గుర్తుచేస్తున్నాయి. ఇక, కామారెడ్డిలో ఎడ్లబండ్ల కొరతతో రైతులు తమ ట్రాక్టర్లనే అందంగా అలంకరించి ఊరేగించడం సరికొత్త సంప్రదాయానికి నాంది పలికారు.

News March 18, 2026

పార్లమెంట్‌లో అమరావతి కళాఖండాల అంశం

image

ప్రాచీన అమరావతి నాగరికత, ఆచార్య నాగార్జునుడికి చెందిన ఎన్నో కళాఖండాలు విదేశీ మ్యూజియంలలో ఉన్నాయి. లండన్‌లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఇవి కొలువు దీరాయి. బ్రిటిష్ కాలంలో మన దేశం నుంచి వీటిని అక్కడికి తరలించారు. ఈ కళాఖండాలను వెనక్కి రప్పించే అంశం తాజాగా పార్లమెంట్‌లో ప్రస్తావనకు వచ్చింది. ఇప్పటికే 600కు పైగా కళాఖండాలను భారత్‌కు తిరిగి తీసుకువచ్చారు. మిగతా వాటిని కూడా రప్పించనున్నారు.

News March 18, 2026

కడప: రైతులకు చెల్లించాల్సింది ఎంతో.. చెళ్లించింది కొంతే.!

image

కడప జిల్లాలో మార్క్ ఫెడ్ ఈ నెల 17 నాటికి 3,143 మంది రైతుల నుంచి 13,078 మెట్రిక్ టన్నుల శనగలు కొనుగోలు చేసింది. క్వింటాలు రూ.5,875ల MSPతో రూ.76.83 కోట్ల శనగలను తీసుకుంది. ఇందుకు గాను ఇప్పటి వరకు కేవలం 89 మంది రైతులకు మాత్రమే పేమెంట్ జరిగింది. 385MTలకు సంబంధించి రూ.1.67 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా 3,054 మంది రైతులకు సంబంధించిన 12.693MTల శనగలకు రూ.75.16 కోట్లు చెల్లించాల్సిఉంది.