News November 19, 2025
ANU: థర్డ్ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో మంగళవారం బిఈడి థర్డ్ సెమిస్టర్, పీజీ సైన్స్, ఆర్ట్స్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఈడి, ఎల్.ఎల్.బి పరీక్షలు ప్రారంభమయ్యాయి. థర్డ్ సెమిస్టర్ 22 పరీక్షా కేంద్రాల్లోను, ఎల్.ఎల్.బి గుంటూరులో మూడు పరీక్ష కేంద్రాలు, ప్రకాశం జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్నాయి. వర్సిటీ పరీక్షల సమన్వయకర్త ఆచార్య ఎం.సుబ్బారావు పరీక్షలు తీరును పరిశీలించారు.
Similar News
News March 3, 2026
మంగళగిరిలో హనుమాన్ ప్రాజెక్ట్ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం

వన్యప్రాణి సంహారాన్ని నివారించి, కో-లివింగ్ వైపు మలచడమే హనుమాన్ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళవారం మంగళగిరి 6వ బెటాలియన్లో ఈ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. వన్యప్రాణుల వల్ల పంట, ప్రాణ నష్టం జరగకుండా ఈ ప్రాజెక్టు దోహదపడుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 100 ప్రత్యేక వాహనాలను ప్రారంభించిన పవన్.. అటవీ శాఖ చరిత్రలో ఇది కీలక రోజని అభివర్ణించారు.
News March 3, 2026
అమెరికా స్వార్థంతోనే యుద్దాలు: CPI నారాయణ

అమెరికా స్వార్థంతోనే పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధం జరుగుతోందని CPIజాతీయ నాయకులు కె.నారాయణ తెలిపారు. 3వ ప్రపంచ యుద్ధంగా ఈ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోందని చెప్పారు. ఎవరు ఆరంభించారో వారే యుద్దానికి ముగింపు పలకాలని హితవు పలికారు. కొత్తపేట CPI కార్యాలయంలో మంగళవారం నారాయణ మాట్లాడారు. యుద్దాల ప్రభావంతో ఆయిల్, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేద మధ్యతరగతి ప్రజలుఇబ్బంది పడతారన్నారు
News March 3, 2026
అమెరికా స్వార్థంతోనే యుద్దాలు: CPI నారాయణ

అమెరికా స్వార్థంతోనే పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధం జరుగుతోందని CPIజాతీయ నాయకులు కె.నారాయణ తెలిపారు. 3వ ప్రపంచ యుద్ధంగా ఈ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోందని చెప్పారు. ఎవరు ఆరంభించారో వారే యుద్దానికి ముగింపు పలకాలని హితవు పలికారు. కొత్తపేట CPI కార్యాలయంలో మంగళవారం నారాయణ మాట్లాడారు. యుద్దాల ప్రభావంతో ఆయిల్, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేద మధ్యతరగతి ప్రజలుఇబ్బంది పడతారన్నారు


