News November 19, 2025
10వ తరగతి ఫలితాల్లో జిల్లా ముందజలో ఉండాలి: కలెక్టర్

పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా ముందంజలో నిలవాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం జరిగిన విద్యా శాఖ సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. తక్కువ ప్రగతి చూపుతున్న విద్యార్థులను గుర్తించి అదనపు బోధన అందించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు మించి ర్యాంకులు సాధించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.
Similar News
News March 18, 2026
VZM: ‘అవసరానికి మించి సిలిండర్లు నిల్వ చేయవద్దు’

జిల్లాలో గృహ అవసర గ్యాస్ సరఫరాపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని జిల్లా పౌర సరఫరాల అధికారి జి.మురళీనాథ్ మంగళవారం తెలిపారు. జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయని, సరఫరా సజావుగా కొనసాగుతోందన్నారు. అత్యవసర పరిస్థితుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు అవసరానికి మించి సిలిండర్లు నిల్వ చేయవద్దని ఆయన సూచించారు.
News March 18, 2026
VZM: ప్రతిభ కనబరిచిన పోలీసులకు ప్రోత్సాహకాలు

విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ దామోదర్ విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ప్రోత్సాహక నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. నేరాల చేధన, ప్రాణరక్షణ, ఆస్తి రికవరీలో విశేష సేవలు అందించిన వారిని అభినందించారు. క్షేత్ర స్థాయి సిబ్బందిని ప్రోత్సహిస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
News March 18, 2026
VZM: ప్రతిభ కనబరిచిన పోలీసులకు ప్రోత్సాహకాలు

విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ దామోదర్ విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ప్రోత్సాహక నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. నేరాల చేధన, ప్రాణరక్షణ, ఆస్తి రికవరీలో విశేష సేవలు అందించిన వారిని అభినందించారు. క్షేత్ర స్థాయి సిబ్బందిని ప్రోత్సహిస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధ్యమని ఆయన పేర్కొన్నారు.


