News November 19, 2025

పెద్దపల్లి: పత్తి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రికి ఎంపీ లేఖ

image

తెలంగాణ పత్తి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు లేఖ రాసినట్లు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంగళవారం తెలిపారు. రాష్ట్ర సగటు పత్తి దిగుబడిని 11.74 క్వింటాళ్లుగా కొనసాగించాలని, అలాగే పత్తిలో మాయిశ్చర్‌ పరిమితిని 20 శాతం వరకు సడలించాలని లేఖలో విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. మిల్లర్లు అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కూడా ఎంపీ కోరినట్లు తెలిపారు.

Similar News

News March 5, 2026

HNK: గుర్తు తెలియని మృతదేహం లభ్యం

image

జిల్లాలోని ఐనవోలు మండలం సింగారం గ్రామ శివారులోని ఊర చెరువు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం కుక్కలు మృతదేహాన్ని పీక్కుతింటుండగా గ్రామస్థులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి తల, చేతులు లేకపోవడంతో గుర్తు పట్టలేని స్థితిలో ఉంది. పురుషుడి మృతదేహంగా ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 5, 2026

వికారాబాద్‌లో పెరిగిన క్రయవిక్రయాలు!

image

వికారాబాద్ జిల్లాలో భూములు ఫ్లాట్లు ఇతరత్రా క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. దీంతో ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుంది. గతేడాది ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి నాటికి జిల్లాలో రూ.54.56 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో అత్యధికంగా వికారాబాద్‌లో రూ.27.59 కోట్ల ఆదాయం సమకూరగా అత్యల్పంగా కొడంగల్లో రూ.6.05 కోట్ల ఆదాయం సమకూరింది.

News March 5, 2026

కర్నూలు: 395 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

image

పత్తికొండ శ్రీ వైష్ణవి డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఆనంద్ రాజ్ కుమార్, ప్రిన్సిపల్ రాజశేఖర్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో వివిధ కంపెనీలలో 395 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఫార్మసీ చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని తెలిపారు.