News November 19, 2025

అల్లూరిలో ఎన్‌కౌంటర్.. భద్రత చర్యలు కట్టుదిట్టం: VZM ఎస్పీ

image

అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన మావోయిస్టుల ఎన్కౌంటర్ నేపథ్యంలో, విజయనగరం జిల్లా వ్యాప్తంగా భద్రతా చర్యలను పోలీసులు కట్టుదిట్టం చేశారు. మావోయిస్టులు సరిహద్దు ప్రాంతాల నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, అన్ని ముఖ్య కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ముమ్మరంగా వాహన తనిఖీలు చేస్తున్నట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. పాత నేరస్తుల కదలికలపై కూడా నిఘా పెట్టినట్లు వెల్లడించారు.

Similar News

News March 16, 2026

VZM: గ్యాస్ బుక్ చేశారా..ఐదు రోజుల్లోనే డెలివరీ

image

జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదని జిల్లా పౌర సరఫరా అధికారి జి. మురళీనాథ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్యాస్ సిలిండర్లు బుక్ చేసిన తర్వాత ఐదు రోజుల్లోగా డెలివరీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల వద్ద తగినంత స్టాక్ అందుబాటులో ఉందని, మూడు గ్యాస్ కంపెనీలు సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని ఆయన వెల్లడించారు. వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

News March 16, 2026

ప్రైవేట్ ఆసుపత్రుల్లో ధరల పట్టికలు తప్పనిసరి: VZM DMHO

image

జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్, క్లినిక్స్, ల్యాబ్స్, స్కాన్ సెంటర్లు తమ సేవల ధరల పట్టికలను తప్పనిసరిగా ప్రజలకు కనిపించేలా ప్రదర్శించాలని DMHO ఎస్. జీవన్ రాణి సోమవారం ఆదేశించారు. స్కాన్ సెంటర్లు పీసీపీఎన్‌డీటీ చట్టం నిబంధనలు పాటిస్తూ లింగ నిర్ధారణ నేరమని తెలుపుతూ బోర్డులు ప్రదర్శించాలని తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 16, 2026

VZM: కలెక్టరేట్‌లో ప్రజల నుండి 233 వినతుల స్వీకరణ

image

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. మొత్తం 233 వినతులు అందగా అందులో 130 రెవెన్యూ శాఖకు సంబంధించినవిగా ఉన్నాయి. వినతులను సకాలంలో పరిష్కరించాలని, ఆలస్యం సహించబోమని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, సర్వే సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.