News November 19, 2025

సంగారెడ్డి: ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేయాలి: ఎస్పీ

image

ప్రతి కేసులో దర్యాప్తు నాణ్యమైన చేయాలని ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యక్రమంలో నేర సమీక్ష సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. లాంగ్ పెండింగ్ కేసుల చేధనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలన్నారు. ఎస్హెచ్ఓలు తమ ఏరియాలో గల ప్రతి గ్రామాన్ని సందర్శించి, ఆయా ప్రాంతాలలో గల సమస్యలను తెలుసుకోవాలని అన్నారు.

Similar News

News March 19, 2026

ఇకపై AP సేవ పోర్టల్‌తో వారికి పథకాలు

image

AP: భవన నిర్మాణ, ఇతర కార్మికులకు సంక్షేమ పథకాలను వేగంగా, పారదర్శకంగా AP సేవ పోర్టల్‌ ద్వారా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివాహ కానుక, ప్రసూతి ప్రయోజనం, సహజ మరణం పథకం, అంత్యక్రియల సమయంలో ఆర్థికసాయం అందించేందుకు ఓకే చెప్పింది. ఈ 4 పథకాల అమలుకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నెల 1వ తేదీ నుంచి ఈ పథకాలు అమల్లోకి వచ్చాయని.. గ్రామ, వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకోవాలని సూచించింది.

News March 19, 2026

రణస్థలం: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

పరీక్షలు సరిగా రాయలేదని, ఫెయిల్ అవుతానని మనస్థాపం చెంది ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన రణస్థలంలో జరిగింది. స్థానిక వెంకటేశ్వర కాలనీకి చెందిన వెంకటేశ్వరరావు(17) ఇంటర్ పరీక్షలు రాశాడు. అయితే ఫెయిల్ అవుతానని భయపడ్డాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిన్న సాయంత్రం ఏడు గంటలకు ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

News March 19, 2026

వామ్మో.. పోలవరం జిల్లాలోకి మళ్లీ పెద్దపులి

image

నిన్నటివరకు కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సంచరించిన పెద్దపులి బుధవారం రాత్రి మరలా పోలవరం జిల్లాలోకి ప్రవేశించినట్లు అధికారులు నిర్ధారించారు. రాజవొమ్మంగి మండలంలోని కొండ లింగంపర్తి, కొత్తపల్లి గ్రామాల సమీపంలో అటవీప్రాంతంలో బుధవారం రాత్రి పులి సంచరించినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం పులి బోర్నగూడెం సమీపంలో ఉన్నట్లు తెలుస్తోంది.