News November 19, 2025

కామారెడ్డి: ఇళ్ల లక్ష్యాలు పకడ్బందీగా సాధించాలి: కలెక్టర్

image

కామారెడ్డి కలెక్టరేట్‌లో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మాచారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట్ మండలాల ఎంపీడీవోలతో జరిగిన ఈ సమావేశంలో.. మండలాల వారీగా నిర్మాణాల పురోగతిని తెలుసుకున్నారు. లక్ష్యాలను వంద శాతం చేరుకునేలా ప్రత్యేక చొరవ తీసుకుని, పనులను వేగవంతం చేయాలని ఎంపీడీవోలకు కలెక్టర్ సూచించారు.

Similar News

News March 13, 2026

HYDలో ‘హైడ్రా’కు సుప్రీం పవర్స్

image

హైడ్రాకు చట్టబద్ధమైన అధికారాలు కల్పించే ‘హైడ్రా చట్టం-2026’ ఈ బడ్జెట్ సెషన్‌లోనే ఆమోదం పొందనుంది. దీని ప్రకారం చెరువులు, నాలాల ఆక్రమణల విషయంలో హైడ్రా ఇచ్చే నోటీసులే తుది నిర్ణయంగా మారుతాయి. సివిల్ కోర్టుల నుంచి స్టే ఆర్డర్లు రాకుండా మున్సిపల్ చట్టాల్లో కీలక సవరణలు చేస్తున్నారు. బడ్జెట్‌లో హైడ్రాకు అదనంగా ₹500 కోట్లు కేటాయించి సొంతంగా ‘ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీస్ ఫోర్స్’ను ఏర్పాటు చేయబోతున్నారు.

News March 13, 2026

పది పరీక్షలకు సర్వం సిద్ధం: డీఈవోలు

image

వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవోలు రంగయ్య, గిరిరాజ్ వెల్లడించారు. వరంగల్ జిల్లాలో మొత్తం 47 పరిక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 288 పాఠశాలల నుంచి 9,472 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇక హనుమకొండలో 64 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 317 పాఠశాలల నుంచి మొత్తం 12,079 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.

News March 13, 2026

తాగునీటి పథకానికి రూ.602 కోట్లు మంజూరు: మంత్రి

image

ఎన్నికలలో ఇచ్చిన హామీలో భాగంగా టెక్కలి నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలకు తాగునీటి కోసం రూ.602 కోట్లు మంజూరైనట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాడేపల్లిలో నేడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిధులు మంజూరు చేశారని ఆయన తెలిపారు. దీంతో ఈ నియోజకవర్గ ప్రజల దాహార్తి పూర్తిగా తీర్చేందుకు ఈ నిధులు వినియోగిస్తామని అన్నారు.