News April 12, 2024
MBNR: కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్కు సుమారు నెల రోజుల సమయం ఉంది. కానీ, మహబూబ్నగర్ లోక్సభ పరిధిలో పోరు తారస్థాయికి చేరింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య నువ్వా.. నేనా అన్నట్లు హోరాహోరీ రణం నడుస్తోంది. ఇరుపార్టీల అభ్యర్థులు డీకే అరుణ, చల్లా వంశీచంద్రెడ్డి మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు, కౌంటర్లు, ప్రతి కౌంటర్లతో పాలమూరు అట్టుడుకుతోంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు.
Similar News
News April 22, 2025
మహనీయుల చరిత్రను అధ్యయనం చేయాలి: ఉపకులపతి

పాలమూరు యూనివర్సిటీలో ఎస్సీ, ఎస్టీ సెల్ & బీసీ సెల్ ఆధ్వర్యంలో మహనీయుల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య జిఎన్ శ్రీనివాస్ హాజరై, మాట్లాడారు. వారి జీవితం, ఆచరణ, సేవలు, దేశం కోసం చేసిన త్యాగాలు మనందరికీ ప్రేరణగా నిలిచాయని, ఈ మహానీయుల జీవిత చరిత్ర మనకు ఎన్నో విషయాలు నేర్పుతుందని అన్నారు. ఎస్పీ D. జానకి, యూనివర్సిటీ అధ్యాపకులు అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.
News April 22, 2025
MBNR: రైతులు అధైర్య పడొద్దు: కలెక్టర్

అకాల వర్షాల కారణంగా తడిసిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్యపడొద్దని కలెక్టర్ విజయేంద్రబోయి అన్నారు. అడ్డాకులలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి కలెక్టర్ సందర్శించారు. ఆదివారం కురిసిన వర్షానికి కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోలు ప్రక్రియను ఎమ్మెల్యే, కలెక్టర్ పరిశీలించారు.
News April 22, 2025
ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

MBNR ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన 92 ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించి నివేదిక ఇవ్వాలని అధికారులను అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశంలో ఫిర్యాదులను స్వీకరించారు. ఏ వారం ఫిర్యాదులను ఆ వారమే పరిష్కరించాలని నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భూ సమస్యలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.