News April 12, 2024
14న గుడివాడలో ‘మేమంతా సిద్ధం’ సభ

గుడివాడలో ఈ నెల 14న సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఇందుకోసం ఏలూరు రోడ్ నాగవరప్పాడు వైఎస్సార్ కాలనీకి సమీపంలో సభ ఏర్పాటు చేస్తున్నారు. 2 రోజులుగా పనులు వేగంగా సాగుతున్నాయి. సిద్ధం సభలో జగన్ ప్రసంగించనున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు జనసమీకరణ చేస్తున్నారు.
Similar News
News April 3, 2026
కృష్ణా : సర్పంచ్ల పాలనకు సెలవ్..!

కృష్ణా జిల్లాలో గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. సర్పంచ్ల పదవీ కాలం ముగియటంతో నేటి నుంచి గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రభుత్వం మండల స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించింది. జిల్లాలో మొత్తం 497 పంచాయతీలు ఉండగా వివిధ కారణాల వల్ల 17 పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. మిగిలిన 470 పంచాయతీల సర్పంచ్ టైమ్ అయిపోవటంతో అక్కడ ప్రత్యేక అధికారులను నియమించారు.
News April 2, 2026
కృష్ణా: బుక్ చేసిన 3- 8 రోజుల్లో సిలిండర్ల డెలివరీ: JC

LPG గ్యాస్ సిలెండర్ల ప్యానిక్ బుకింగ్స్ తగ్గడంతో జిల్లాలో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ ఓ ప్రకటనలో తెలిపారు. సాధారణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. బుక్ చేసిన 3 నుంచి 8 రోజుల్లో డెలివరీలు జరుగుతున్నాయన్నారు. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఏమైనా సమస్యలు ఉంటే DCO ఆఫీస్ నంబర్ 08672-252493, రాష్ట్ర హెల్ప్ లైన్ నంబర్ 1967కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.
News April 1, 2026
కృష్ణా జిల్లాలో మద్యం అమ్మకాల సేల్ వాల్యు విలువ ఎంతంటే..!

కృష్ణా జిల్లాలో ఏప్రిల్ 2025 – మార్చి 2026 మధ్య మద్యం అమ్మకాల సేల్ వాల్యు విలువలో(-2%) తిరోగమనం కనిపించింది. గత 12 నెలల్లో రూ.1,064.95 కోట్ల విలువైన 14.84 లక్షల ఇండియన్ మేడ్ లిక్కర్(IML) బాక్సులు, 6.75 లక్షల బీరు బాక్సులు అమ్ముడవ్వగా, ఏప్రిల్ 2024 – మార్చి 2025 మధ్య ఈ గణాంకాలు 13.89 లక్షలు (IML బాక్సులు), బీరు బాక్సులు 3.99 లక్షలుగా, సేల్ వాల్యూ రూ.1,083.23 కోట్లుగా నమోదైంది.


