News November 19, 2025
తరాలకు మార్గదర్శకంగా సత్యసాయి బాబా జీవితం: మోదీ

AP: రేపు పుట్టపర్తిలో జరిగే శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఎదురుచూస్తున్నానని పీఎం మోదీ ట్వీట్ చేశారు. సమాజ సేవ, ఆధ్యాత్మిక మేల్కొలుపు కోసం సత్యసాయి జీవితం, చేసిన ప్రయత్నాలు తరతరాలకు మార్గదర్శకంగా ఉంటాయని తెలిపారు. సత్యసాయి బాబాతో సంభాషించడానికి ఆయన నుంచి నేర్చుకోవడానికి కొన్ని అవకాశాలు తనకు లభించాయన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే సచిన్ పుట్టపర్తికి చేరుకున్నారు.
Similar News
News March 14, 2026
NDAతో పొత్తు ఉండదు: విజయ్

TNలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో NDAతో పొత్తు ఉండదని TVK చీఫ్ విజయ్ స్పష్టం చేశారు. వారితో కలిసి పోటీ చేసే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. పొత్తుపై జరుగుతున్న ప్రచారాలన్నీ ఊహాగానాలే అని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ ప్రకటించారు. ఈ విషయాన్ని గతంలోనే చెప్పామని గుర్తు చేశారు. BJP తమకు సైద్ధాంతిక శత్రువు అన్నారు. పార్టీ అధికారిక ప్రకటన ఇస్తేనే ఇలాంటి వాటిని నమ్మాలని కార్యకర్తలకు సూచించారు.
News March 14, 2026
హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రైల్!

TG: హైదరాబాద్ చుట్టూ ఏర్పాటయ్యే రీజినల్ రింగురోడ్డు వెంబడే రీజినల్ రింగ్ రైల్ (RRR) ఏర్పాటుకానుంది. దీని DPR కోసం సర్వేకి అనుమతులు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ లోక్సభలో MP కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చారు. నీతి ఆయోగ్, ఆర్థికశాఖ అనుమతి తరువాత దీనికి తుది అనుమతి లభించనుంది. దీనివల్ల HYD చుట్టూ ఉన్న ప్రాంతాలకు రవాణా సులభం అవడంతో పాటు ఆర్థికాభివృద్ధికి మార్గం ఏర్పడుతుంది.
News March 14, 2026
OTP పద్ధతిలోనే సిలిండర్: పయ్యావుల

AP: రాష్ట్రంలో గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. సిలిండర్ బుకింగ్ ఆన్లైన్లో ఉండాలని ఏజెన్సీలకు స్పష్టం చేశామన్నారు. బ్లాక్ మార్కెట్కు తరలిపోకుండా OTP పద్ధతిలోనే సిలిండర్ ఇస్తారని పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గ్యాస్ ధరలు పెరగకుండా చూస్తున్నామన్నారు. అధిక ధరలు వసూలు చేసే హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు.


