News April 12, 2024

HYDలో రూ.29 భారత్ రైస్ అమ్మకాలు షురూ

image

HYD ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. నేషనల్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గ్రేటర్ HYD పరిధిలో 24 కేంద్రాల్లో భారత్ రైస్ విక్రయాలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 10 కిలోల బ్యాగులు అందిస్తున్నట్లుగా వెల్లడించారు. కిలో భారత్ రైస్ రూ.29కాగా.. 10 కిలోల బ్యాగుకు రూ.290 చెల్లించాల్సి ఉంది.

Similar News

News March 3, 2026

HYD: మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తే.. రంగుపడుద్ది

image

హోలీ వేడుకల ముసుగులో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. రంగులు చల్లే నెపంతో వేధింపులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, అటువంటి వారిపై కఠిన కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. నగరవ్యాప్తంగా షీ-టీమ్స్, గస్తీ బృందాలు నిరంతరం నిఘా ఉంచుతాయని తెలిపారు. ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే వెంటనే 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

News March 3, 2026

HYD: మహిళా దారుణ హత్య

image

వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం ఎల్లకొండ సమీపంలో మహిళా దారుణ హత్యకు గురైంది. ఎత్తిరాజ్‌పల్లి గ్రామానికి చెందిన బాలమణిని(45) గుర్తుతెలియని దుండగులు గొంతుకోసి అత్యంత క్రూరంగా హత్య చేశారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న మూడు తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎస్సై పుండ్లిక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 3, 2026

HYD: సిటీకి కొత్త సింగారం!

image

​నగరం పాత, కొత్తల కలబోతగా మారుతోంది. మార్చి 4న హోలీ వేడుకలు, హెరిటేజ్ రన్ వంటి ఈవెంట్లతో నగరం కళకళలాడుతోంది. ఫుడ్ విషయంలోనూ మన తెలుగు రుచులకే పట్టం కడుతున్నారు. చిరుధాన్యాల వంటకాలతో పాటు కొరియన్ ఫుడ్ తెగ ట్రెండ్ అవుతోంది. ఆర్గానిక్ ఫ్యాషన్, టెక్ సదస్సులతో హైటెక్ సిటీ కొత్త పుంతలు తొక్కుతోంది. పలు చోట్ల వేడుకలకు మ్యూజిక్ సిస్టమ్, గ్రౌండ్‌లోనే రెయిన్ డాన్స్‌కు వాటర్ షవర్లు ఏర్పాటు చేస్తున్నారు.