News November 19, 2025
కర్నూలు ఘోర ప్రమాదం.. మృతులు వీరే..!

కర్నూలు జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసిందే. జాతీయ రహదారిపై కేశవ గ్రాండ్ హోటల్ వద్ద రోడ్డు దాటుతున్న పాదచారులను హైదరాబాద్ వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కల్లూరు మండలం గోకులపాడుకు చెందిన లక్ష్మీనారాయణ(56), శ్రీనివాసులు(65), రామిరెడ్డి(40)గా పోలీసులు గుర్తించారు. మెకానిక్ షేక్ జిలాని బాషా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Similar News
News March 22, 2026
జిల్లాలో నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ కసరత్తు

భద్రాద్రి జిల్లాలో నామినేటెడ్ పదవుల భర్తీకి కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు ముమ్మరం చేసింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన వారు, ఎన్నికల ముందు చేరి గెలుపునకు కృషి చేసిన నేతల వివరాలను సేకరిస్తోంది. త్వరలోనే పదవుల ప్రకటన ఉండే అవకాశం ఉండటంతో అంతర్గతంగా వడపోత సాగిస్తోంది. ఏళ్ల తరబడి జెండా మోసిన కార్యకర్తలకే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆశావహుల ప్రయత్నాలు పెరిగాయి.
News March 22, 2026
JGTL: జీవన్ రెడ్డి వెంట వెళ్లేదెవరు.. అనుచరుల రహస్య సమావేశాలు!

మాజీమంత్రి జీవన్ రెడ్డి BRSలో చేరడం దాదాపు ఖాయమైంది. ఈ మేరకు ఆయన అనుచర వర్గంతో వరుస చర్చలు జరుపుతున్నారు. అయితే 2 రోజులుగా జీవన్ రెడ్డి ముఖ్య అనుచరులు రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇన్నాళ్లు BRSకు, ఆ నాయకులకు వ్యతిరేకంగా పోరాటం చేసి మళ్లీ అదే పార్టీలో చేరడంపై కొంత ఆలోచనలో పడ్డారు. దీనిపై కొందరిని అడిగితే ఇంకా తాము పార్టీ మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొనడం కొసమెరుపుగా మారింది.
News March 22, 2026
‘పెద్ది’లో మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్?

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. త్వరలోనే సాంగ్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న జాన్వీ కపూర్ కూడా స్పెషల్ సాంగ్లో స్క్రీన్ షేర్ చేసుకుంటారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ప్రస్తుతం మృణాల్ తెలుగులో అడివి శేష్తో కలిసి ‘డెకాయిట్’ మూవీలో నటిస్తున్నారు.


