News November 19, 2025

అఖండ పల్నాడు రారాజు అనుగు రాజు యాదవ్ గురించి తెలుసా..?

image

పల్నాడు చరిత్ర అనగానే బ్రహ్మనాయుడు, నాగమ్మ గుర్తుకొస్తారు. అయితే అఖండ పల్నాడును పరిపాలించిన అనుగురాజు యాదవ్ పాత్ర కీలకమైనది. ఈయనకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య కుమారుడు మలిదేవుడు మాచర్ల రాజధానిగా బ్రహ్మనాయుడు మంత్రిగా, చిన్న భార్య కుమారుడు నలగామ రాజు గురజాల రాజధానిగా నాగమ్మ మంత్రిగా పరిపాలించారు. దాయాదుల మధ్య జరిగిందే పల్నాటి యుద్ధం అనుగరాజ గుర్తుగా పిడుగురాళ్లలో ఆయన విగ్రహం ఏర్పాటు చేశారు.

Similar News

News March 22, 2026

విశాఖ: ప్రభుత్వ కార్యాలయాల్లో రేపు పీజీఆర్ఎస్

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు. ఉదయం 11 నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News March 22, 2026

పల్నాడు: పిడుగుపాటుకు గురై పాడి రైతు మృతి!

image

పల్నాడు (D) అమరావతి(M) ఎండ్రాయిలో పిడుగుపాటుకు ఓ పాడి రైతు బలయ్యాడు. గ్రామానికి చెందిన విజయ్ కుమార్ శనివారం సాయంత్రం గేదెలను మేపేందుకు పొలానికి వెళ్లగా, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రాత్రి అయినా ఆయన ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూడగా.. గట్టుపై పిడుగు పడి విజయ్ మృతి చెంది ఉండటం గమనించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 22, 2026

ఒంటిమిట్టలో ఆక్రమణలు తొలగిస్తారా..?

image

ఒంటిమిట్ట కోదండరామాలయంలోని పంచాయతీ స్థలాలు ఆక్రమణలు పరిపాటిగా మారాయి. ప్రజలు, భక్తులు నడిచే కాలినడక బాటను సైతం దుకాణాల పేరుతో వదిలారన్నారు. మండల అధికార యంత్రానికి విషయం తెలిసినా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అక్రమణలపై చేయి కుడా వేయలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లను జయించి అధికార యంత్రాగం ఆక్రమణలు తొలగిస్తుందా.. లేక ఎప్పటిలాగే కళ్లుమూసుకుంటుందా వేచి చూడాలని విశ్లేషకులు అంటున్నారు.