News November 19, 2025

నేడు నెల్లూరు జిల్లాలో 1.95 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు.!

image

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రైతులు ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ రెండో విడత నిధులు బుధవారం వారి ఖాతాలకు జమ కాబోతున్నాయి. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. జిల్లాలో 1.95 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.130.20 కోట్లు జమ అవుతాయన్నారు. నియోజకవర్గాలవారిగా ఎమ్మెల్యేలు, కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

Similar News

News March 5, 2026

100% ఉత్తీర్ణతే లక్ష్యంగా 100 రోజుల యాక్షన్ ప్లాన్: DEO

image

ప్రభుత్వ పాఠశాలల్లో 10 తరగతి చదివే విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు DEO బాలాజీరావు తెలిపారు. గురువారం కందుకూరు వచ్చిన ఆయన పక్కా ప్రణాళికతో లక్ష్యాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 6 తేదీ నుంచి 100 రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల ప్రతిభా స్థాయిని బట్టి 4 కేటగిరీలుగా విభజించి ప్లాన్ ప్రకారం బోధన చేయిస్తున్నట్లు చెప్పారు.

News March 5, 2026

వెంకటగిరి: ఈ అమ్మాయిలు బంగారం.!

image

వెంకటగిరిలో విద్యార్థులు తమకు దొరికిన బంగారాన్ని పోలీసులకు అప్పజెప్పి మానవత్వం చాటుకున్నారు. కాజీపేటలో మార్గంలోని SBI బ్యాంక్ సమీపంలో రోడ్డుపై ZP బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు రూ.6,28,500 విలువ గల 4.5 సవర్ల బంగారం దొరికింది. వారు బంగారాన్ని ఎస్ఐ స్వరూపకు అందించారు. ఆ బంగారం పట్టణంలోని మహాలక్ష్మిదిగా గుర్తించి ఆమెకు అప్పగించారు. ఈ మేరకు విద్యార్థులను SI, బాధితురాలు అభినందించారు.

News March 5, 2026

ఎవరు చెప్పినా నేను వినను: మంత్రి నారాయణ

image

‘విజేతారెడ్డి, అనురాధ, రూప్, వీబీఆర్ దగ్గరకు వెళ్తే పనులవుతాయి అనుకోవద్దు. ఎవరు చెప్పినా నేను వినను’ అంటూ మంత్రి నారాయణ మాట్లాడినట్లు ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పార్టీలోనే వ్యతిరేక వర్గం తయారైందని ఆయన మండిపడినట్లు ఆడియోలో ఉంది. సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని, తన కోసం 700 మంది పని చేస్తున్నారని నారాయణ పేర్కొన్నారు.