News November 19, 2025
పల్నాడు జిల్లాను పచ్చదనంతో నింపాలి: కలెక్టర్

జిల్లాను పచ్చదనంతో నింపి హరిత పల్నాడును ఆవిష్కృతం చేయాలని కలెక్టర్ కృతిక శుక్లా అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం వనం – మనం జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో అన్ని శాఖలు సమష్టిగా, సమన్వయంతో పనిచేయాలని అన్నారు. విద్యా సంస్థలు, ఇతర కార్యాలయాలు, ఖాళీ స్థలాలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. ప్రతి శాఖకు నిర్దేశించిన లక్ష్యాలు, లక్ష్యాలుపై నివేదిక సమర్పించాలన్నారు.
Similar News
News March 18, 2026
TGNPDCL అధికారుల డిప్యూటేషన్కు ఆదేశాలు

హనుమకొండ: TGNPDCL నుంచి TGRPDCLకు 12 మంది అధికారులను డిప్యూటేషన్పై పంపిస్తూ CMD కర్ణాటి వరుణ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త డిస్కం ఏర్పాటుతో కార్యకలాపాల ప్రారంభం, ఆస్తులు-బాధ్యతల విభజన, నెట్వర్క్ పునర్వ్యవస్థీకరణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారులు తక్షణమే హాజరుకావాలని, డిప్యూటేషన్ గడువు ఒక సంవత్సరం అని తెలిపారు.
News March 18, 2026
విశాఖ: స్టీల్ ప్లాంట్లో 5 రోజుల వరకే గ్యాస్ నిల్వలు

విశాఖ స్టీల్ ప్లాంట్కు ఎల్పీజీ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. పశ్చిమ ఆసియా యుద్ధంతో కేంద్రం ఆంక్షలు విధించి గృహ, ఆస్పత్రులకే ప్రాధాన్యం ఇచ్చింది. ప్లాంట్ ఉత్పత్తికి రోజుకు 12 టన్నుల గ్యాస్ అవసరముండగా కేవలం 5 రోజుల నిల్వలే మిగిలాయి. కటింగ్ పనులు, ఉత్పత్తి నిలిచే ప్రమాదం ఉంది. స్టీల్ బ్లూమ్స్ను బయట ప్రాసెసింగ్కు పంపడంతో ఖర్చులు పెరుగుతున్నాయి. కేటాయింపులు పెంచాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
News March 18, 2026
కడప జిల్లాలో భారీగా ఆగిన నగదు చెల్లింపు

కడప జిల్లాలో మార్క్ ఫెడ్ ఈ నెల 17 నాటికి 3,143 మంది రైతుల నుంచి 13,078 మెట్రిక్ టన్నుల శనగలు కొనుగోలు చేసింది. క్వింటాలు రూ.5,875ల MSPతో రూ.76.83 కోట్ల శనగలను తీసుకుంది. ఇందుకు గాను ఇప్పటి వరకు కేవలం 89 మంది రైతులకు మాత్రమే పేమెంట్ జరిగింది. 385MTలకు సంబంధించి రూ.1.67 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా 3,054 మంది రైతులకు సంబంధించిన 12.693MTల శనగలకు రూ.75.16 కోట్లు చెల్లించాల్సిఉంది.


