News November 19, 2025

సాధారణ ప్రసవాలు పెంచాలి: కలెక్టర్

image

ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరగాలంటే సేవల నాణ్యత మెరుగుపడాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. తిరుమలాయపాలెం, నేలకొండపల్లి ప్రాంతాల్లో సాధారణ ప్రసవాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గర్భిణీల ఫాలోఅప్‌ను ఆశా కార్యకర్తలతో సమన్వయం చేయాలని, ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫరల్ అవకాశం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News March 22, 2026

ఆత్కూరు కోల్డ్ స్టోరేజ్‌ అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్

image

ఆత్కూరు సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్‌లో జరిగిన అగ్నిప్రమాద స్థలాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదివారం పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంటల వల్ల జరిగిన ఆస్తి, పంట నష్టంపై పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట పలువురు రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారులు ఉన్నారు.

News March 22, 2026

ఖమ్మం: సర్కారు దవాఖానాల్లో తగ్గుతున్న ప్రసవాలు!

image

ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ వైద్యంపై పర్యవేక్షణ లోపం గర్భిణులను ప్రైవేటు బాట పట్టిస్తోంది. గత ఏడాది సర్కారు ఆస్పత్రుల్లో కేవలం 6,316కాన్పులే జరగగా, ప్రైవేటులో ఆ సంఖ్య 7,789కి చేరడం గమనార్హం. వీటిలో అధిక శాతం సిజేరియన్లే కావడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణ ప్రసవాలు పెంచాలని కలెక్టర్ ఆదేశిస్తున్నా, క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల పరిస్థితిలో మార్పు రావడం లేదు. దీంతో పేదలకు వైద్యభారం తప్పడం లేదు.

News March 21, 2026

నేరాల నియంత్రణే లక్ష్యం: పోలీస్ కమిషనర్ సునీల్ దత్

image

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా శనివారం పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. సీపీ సునీల్ దత్ ఆదేశాల మేరకు బ్యాంకులు, ఏటీఎంలు, ప్రధాన కూడళ్ల వద్ద పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. ఇసుక, గంజాయి, రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా వాహన సోదాలు నిర్వహించారు. రాత్రి వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను సీజ్ చేశారు.