News November 19, 2025
గడిచిన 5 నెలల్లో 1558 మందిపై కేసులు: బాపట్ల ఎస్పీ

విద్యాసంస్థల సమీపంలో గంజాయి, ఇతర పొగాకు ఉత్పత్తుల విక్రయాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఉమామహేశ్వర్ హెచ్చరించారు. పాఠశాలలు, కళాశాలల సమీపంలోని దుకాణాలను సంబంధిత పోలీసు అధికారులు ముమ్మరంగా తనిఖీ చేశారన్నారు. గుట్కా వంటి వాటిని విక్రయిస్తున్న 80 మందిపై COTPA చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. గడిచిన 5 నెలల నుంచి 1558 మందిపై కేసులు నమోదు చేశామన్నారు.
Similar News
News March 7, 2026
రేపు కెప్టెన్ సూర్య రిటైర్మెంట్?

INDT20 జట్టు కెప్టెన్ సూర్య రేపు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు సమాచారం. కివీస్తో జరిగే T20WC ఫైనల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఫామ్ తగ్గడం, వయసు పెరగడం(35 ఏళ్లు), కెరీర్ చివరి దశలో ఉన్నందున రిటైర్మెంట్కు ఇదే మంచి తరుణమని భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. కాగా SKY కెప్టెన్సీలో IND ఒక్క సిరీసూ ఓడిపోలేదు. అయితే బ్యాటర్గా విఫలమవుతున్నారు.
News March 7, 2026
8 మంది MLAలకు క్లీన్ చిట్

TG: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ ముగిసింది. 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్చిట్ ఇచ్చారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి కేసులో తీర్పును ఆయన రిజర్వ్ చేశారు.
News March 7, 2026
దేశంలోనే అతిపెద్ద లొంగుబాటు: రేవంత్

TG: దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద మావోయిస్టు <<19321592>>లొంగుబాటు<<>> అని CM రేవంత్ అన్నారు. మావోయిస్టు అగ్రనేత గణపతి సహా అజ్ఞాతంలో ఉన్న మిగతావాళ్లంతా జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. గణపతి రక్షణ, ఆరోగ్య భద్రత ప్రభుత్వానిదే అని హామీ ఇచ్చారు. లొంగిపోయిన మావోలకు ఆరోగ్య, ఆర్థిక భద్రతకు ప్రభుత్వం తరఫున హామీ ఇస్తున్నామన్నారు. మావోలు లేవనెత్తిన రాష్ట్ర పరిధిలోని అంశాలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.


