News November 19, 2025
రాష్ట్రంలోనే ఏలూరు ప్రథమ స్థానం: సాల్మన్ రాజ్

ఏలూరు జిల్లాలో పీఎం సూర్యఘర్ పథకం కింద ఇప్పటివరకు 1,00,026 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన 31,022 రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లను గ్రిడ్కు అనుసంధానించినట్లు ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ సాల్మన్ రాజు తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధికంగా ఏలూరు జిల్లాలో 4,218 మంది వినియోగదారులు సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నారన్నారు. పథకం సమాచారం కోసం 1912కు కాల్ చేయవచ్చని ఆయన సూచించారు.
Similar News
News March 8, 2026
చరిత్రలో ఈరోజు (మార్చి 8)

1897: చిత్రకారుడు దామెర్ల రామారావు జననం
1917: విద్యుత్తు రంగ నిపుణుడు నార్ల తాతారావు జననం
1989: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ జననం
1993: చిలకలూరిపేట బస్సు దహనం ఘటనలో 23 మంది మృతి
2012: సినీ నటి రాధాకుమారి మరణం
☛ అంతర్జాతీయ మహిళా దినోత్సవం
News March 8, 2026
కామారెడ్డి: చిన్నారుల మిస్సింగ్.. విషాదాంతం..!

కామారెడ్డి ఆర్బీనగర్ కాలనీలో అదృశ్యమైన <<19324752>>ముగ్గురు చిన్నారులూ<<>> మృతి చెందారు. అక్కచెల్లెలైన సిపత్ (8), అయాత్ (7), మరియం(5) కామారెడ్డి సమీపంలో విగతజీవులుగా కనిపించారు. ఇప్పటికే ఇద్దరి మృతదేహాలను గుర్తించగా.. కొద్దిసేపటి క్రితమే సిపత్ డెడ్బాడీ లభ్యమయ్యింది. కాగా పోలీసుల అదుపులో చిన్నారుల తండ్రి ఉన్నట్లు సమాచారం.
News March 8, 2026
మహబూబాబాద్: లోక్ అదాలత్ను విజయవంతం చేయండి: జిల్లా జడ్జి

మార్చి 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కోర్టులో పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాజీ పడదగ్గ పెండింగ్ కేసులను గుర్తించి, ఎక్కువ సంఖ్యలో పరిష్కారమయ్యేలా చూడాలని సూచించారు. గత లోక్ అదాలత్లో మహబూబాబాద్ జిల్లా రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించిందని, అదే స్ఫూర్తితో ఈసారి కూడా పనిచేయాలన్నారు.


