News November 19, 2025
భక్తులకు అన్ని వసతులు కల్పించాలి: ఆది శ్రీనివాస్

వేములవాడకు వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. భక్తులకు కల్పించాల్సిన వసతులపై ఇన్ఛార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతే, ఇతర శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. భీమేశ్వర స్వామి ఆలయానికి వస్తున్న భక్తుల సంఖ్య, చెల్లించుకుంటున్న మొక్కుల వివరాలను ఆయన ఆరా తీశారు.
Similar News
News March 20, 2026
భద్రాద్రి రాముడిపై వివాదం.. 23న హైకోర్టు విచారణ

భద్రాద్రి క్షేత్రంలో కొలువైన శ్రీరాముడు ‘దశరథ రాముడా’ లేదా ‘వైకుంఠ రాముడా’ అనే అంశంపై నెలకొన్న వివాదంపై ఈ నెల 23న హైకోర్టులో విచారణ జరగనుంది. దీనిపై స్పష్టత కోసం ప్రభుత్వం ఇప్పటికే ఐదుగురు పండితులతో కూడిన కమిటీని నియమించగా, వారు తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఆ నివేదికలోని అంశాలపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. కోర్టు విచారణ అనంతరం ఈ వివాదానికి తెరపడే అవకాశం ఉందని భక్తులు భావిస్తున్నారు.
News March 20, 2026
నల్గొండ: 20 రోజుల్లోనే రూ.30 పెంపు.. బెంబేలెత్తుతున్న జనం

పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు జిల్లాలోని వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధాన్ని సాకుగా చూపుతూ వ్యాపారులు వంట నూనెల ధరలను అడ్డగోలుగా పెంచేస్తున్నారు. జిల్లాలో గత 20 రోజుల్లోనే కిలో ప్యాకెట్పై ఏకంగా రూ.30 వరకు పెరగడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పామాయిల్ రూ.140కి చేరగా, పల్లీ నూనె రూ.175లకు విక్రయిస్తున్నారు. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న విమర్శలున్నాయి.
News March 20, 2026
ఎన్నికల బరిలో హత్యాచార బాధితురాలి తల్లి!

బెంగాల్ ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో <<15698320>>హత్యాచారానికి <<>>గురైన బాధితురాలి తల్లి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. పానీహటి నుంచి కంటెస్ట్ చేయాలనుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. గతంలో BJP తనకు టికెట్ ఆఫర్ చేసిందని చెప్పారు. ఇటీవల ఆ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించగా పానీహటి సీటును పెండింగ్లో పెట్టింది. దీంతో ఆమెకే టికెట్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకోనుంది.


