News November 19, 2025
భక్తులకు అన్ని వసతులు కల్పించాలి: ఆది శ్రీనివాస్

వేములవాడకు వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. భక్తులకు కల్పించాల్సిన వసతులపై ఇన్ఛార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతే, ఇతర శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. భీమేశ్వర స్వామి ఆలయానికి వస్తున్న భక్తుల సంఖ్య, చెల్లించుకుంటున్న మొక్కుల వివరాలను ఆయన ఆరా తీశారు.
Similar News
News March 4, 2026
3 ముక్కల HYD.. ‘గ్రేటర్’ కథ కంచికే!

FEB 10తో GHMC కౌన్సిల్ పదవీకాలం ముగియడమే ఆలస్యం.. సర్కారు సిటీని 3 ముక్కలు చేస్తూ GO నం. 55 ఇచ్చేసింది. ఈ ముక్కలాట వెనుక అసలు కిటుకు వార్డుల పునర్విభజన. పాతబస్తీ పట్టు తగ్గించి కొత్త ఏరియాల్లో పొలిటికల్ పవర్ మార్చడమే అసలు ప్లాన్ అని విశ్లేషకులు అంటున్నారు. ఏటా రూ.2,000 కోట్ల ట్యాక్స్ కట్టే IT ఏరియా CYB కిందకి వెళ్లడంతో GHMC డెవలప్మెంట్ కోసం నిధులు ఎక్కడి నుంచి తెస్తారో? అన్నది సవాల్గా మారింది.
News March 4, 2026
తిరుపతిలో 20 ఏళ్ల CM కల.. తీరేనా?

రుయాతోపాటు TTD పరిధిలోని స్విమ్స్, బర్డ్ ఆసుపత్రులను ఓకే గొడుగు కిందకు తేవడం CM చంద్రబాబు ఆలోచన. దీంతో యాత్రికులు, స్థానికులకు మెరుగైన వైద్యం అందిచవచ్చు. 20 ఏళ్లుగా ఈ ప్రతిపాదన ముందుకు కదలడం లేదు. TTD మాజీ EO అనిల్ ఇందుకు వ్యతిరేకత చూపినట్లు సమాచారం. రుయా సర్వీస్ రూల్స్, TTD సర్వీస్ రూల్స్ వేరు కావడం, సాంకేతిక, పాలన పరమైన అంశాలను ప్రధాన కారణంగా చెబుతున్నారు. మరోసారి CM దీనిని తెరపైకి తెచ్చారు.
News March 4, 2026
గుండ్ల సింగారం కెనాల్లో లభ్యమైన మృతదేహం

ఎస్ఆర్ఎస్పీ కాలువలో పడి గల్లంతైన భీమారం వాసి సాంబయ్య మృతదేహం బుధవారం లభ్యమైంది. సోమవారం సాయంత్రం గుండ్లసింగారం వద్ద ప్రమాదవశాత్తు కాలువలో పడి ఆయన కొట్టుకుపోయారు. కేయూసీ సీఐ రవికుమార్ తెలిపిన వివరాలు.. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా, పలువేల్పుల ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.


