News November 19, 2025
సిరిసిల్లలో పత్తి కొనుగోళ్లు ప్రారంభం

రాజన్న జిల్లా జిన్నింగ్ మిల్ నిర్వాహకులు ప్రభుత్వ అధికారులతో చర్చల అనంతరం సమ్మె విరమించారు. ప్రతి మిల్లులో పత్తి కొనుగోలుకు అవకాశం ఇవ్వాలని, ఎకరాకు 12 క్వింటాళ్ల కొనుగోలుకు అనుమతించాలనే ప్రధాన డిమాండ్లపై ఏకాభిప్రాయం కుదిరినట్లు మిల్లర్ల అసోసియేషన్ తెలిపింది. దీంతో జిల్లాలో మంగళవారం సాయంత్రం పత్తి కొనుగోళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి.
Similar News
News April 5, 2026
2 వారాలు మైదా మానేస్తే?

కేవలం 2 వారాలు మైదా పక్కన పెడితే శరీరంలో అద్భుతమైన మార్పులు గమనించొచ్చని నిపుణులు చెబుతున్నారు. మైదా వల్ల వచ్చే షుగర్ స్పైక్స్ తగ్గి రోజంతా ఎనర్జీ లెవల్స్ స్థిరంగా ఉంటాయి. ఇందులో ఫైబర్ ఉండదు. కాబట్టి దీన్ని మానేస్తే జీర్ణక్రియ మెరుగై గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు రావు. మైదాకు బదులు తృణధాన్యాలు తింటే ఆకలి త్వరగా వేయదు. వెయిట్ లాస్ కూడా ఈజీ అవుతుంది. విటమిన్లు, మెగ్నీషియం పెరిగి చర్మం మెరుస్తుంది.
News April 5, 2026
గుంటూరులో రూ.లక్షల్లో మోసం.. మహిళపై కేసు

బంగారం షాపు యజమానిని మోసం చేసిన మహిళపై అరండల్ పేట స్టేషన్లో కేసు నమోదైంది. ఫైనాన్స్లో ఉన్న తన బంగారాన్ని విడిపించు కోవాలని చెప్పి ఓ మహిళ బంగారం షాపు యజమాని వద్ద రూ.19 లక్షల నగదుతో పాటు రూ.4 లక్షల విలువైన ఆభరణాలను అప్పుగా తీసుకుంది. ఆమె తీసుకున్న నగదు, బంగారాన్ని తిరిగి ఇవ్వకుండా తాత్సారం చేస్తోంది. దీంతో బంగారం షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News April 5, 2026
ఉప్పల్లో SRHకు అదిరిపోయే రికార్డులు!

IPL: హోంగ్రౌండ్ ఉప్పల్లో SRH తన పర్ఫార్మెన్స్తో అభిమానులను ఊర్రూతలూగిస్తూనే ఉంటుంది. 2013 నుంచి ఈ గ్రౌండులో ఆ జట్టు 63 మ్యాచులు ఆడగా 38 విజయాలను సొంతం చేసుకుంది. విన్నింగ్ పర్సెంటేజ్ 61కి పైనే ఉంది. మరోవైపు లీగ్లో ఇప్పటి వరకు నమోదైన రెండో అత్యధిక స్కోర్(286) గత సీజన్లో RRపై చేసింది. 2025లోనే పంజాబ్ జట్టుపై 247 పరుగులనూ ఛేదించింది. ఇక ఉప్పల్లో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే 57% గెలవడం గమనార్హం.


