News November 19, 2025

జైనథ్: 8 మంది దొంగల అరెస్ట్

image

ఈ నెల 14న జైనథ్‌లోని హాత్తిఘాట్ పంపుహౌస్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి గురైన రూ.4.8 లక్షల సామగ్రిని రికవరీ చేశారు. మంగళవారం 12 మందిపై కేసు నమోదు చేసి, ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. దొంగిలించిన సామగ్రి, రెండు మొబైల్ ఫోన్లు, ఒక ఆటో, రూ.7,140 నగదును స్వాధీనం చేసుకున్నారు. సామగ్రి కొనుగోలు చేసిన స్క్రాప్ దుకాణదారుడిని కూడా రిమాండ్‌కు పంపినట్లు సీఐ శ్రావణ్ కుమార్ తెలిపారు.

Similar News

News March 23, 2026

గ్యాస్ దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవు: ADB SP

image

ఆదిలాబాద్ జిల్లాలో గృహ వినియోగ LPG గ్యాస్‌ను వాణిజ్య అవసరాలకు వినియోగించవద్దని SP అఖిల్ మహాజన్ హెచ్చరించారు. రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా 8 బృందాలతో హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. గ్యాస్ దుర్వినియోగం ప్రమాదాలకు దారి తీస్తుందని సూచించారు. అనుమానాస్పద వినియోగంపై డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.

News March 23, 2026

ADB: ఇంగ్లిష్ పరీక్షకు 18మంది గైర్హాజరు

image

ఆదిలాబాద్ జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. సోమవారం ఇంగ్లిష్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని అధికారులు పేర్కొన్నారు. మొత్తం 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా సోమవారం జరిగిన పరీక్షకు 10878 మంది విద్యార్థులకు గాను 10860 మంది విద్యార్థులు హాజరై 18 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పోలీసుల బందోబస్తు నడుమ పరీక్షలు కొనసాగుతున్నాయి.

News March 23, 2026

ADB: ఇంగ్లిష్ పరీక్షకు 18మంది గైర్హాజరు

image

ఆదిలాబాద్ జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. సోమవారం ఇంగ్లిష్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని అధికారులు పేర్కొన్నారు. మొత్తం 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా సోమవారం జరిగిన పరీక్షకు 10878 మంది విద్యార్థులకు గాను 10860 మంది విద్యార్థులు హాజరై 18 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పోలీసుల బందోబస్తు నడుమ పరీక్షలు కొనసాగుతున్నాయి.