News November 19, 2025

ఆన్లైన్ మోసాలపై తస్మాత్ జాగ్రత్త: ప్రకాశం SP

image

ఆన్‌లైన్ మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా SP హర్షవర్ధన్ రాజు సూచించారు. మంగళవారం ఒంగోలు SP కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇటీవల కాలంలో ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్నాయని అన్నారు. ఫ్రాడ్ కాల్ స్కామ్‌ల ద్వారా సైబర్ మోసగాళ్లు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి మోసాలపై హెల్ప్ లైన్ నంబర్ 1930కు సమాచారం ఇవ్వాలని కోరారు.

Similar News

News March 17, 2026

ప్రకాశం: పంచాయతీలకు ఏప్రిల్ 2 నుంచి ప్రత్యేక అధికారులు

image

జిల్లాలో పంచాయితీ సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ఏప్రిల్ 2 నుంచి జిల్లాలో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోందని DPO వెంకటేశ్వరరావు అన్నారు. పంచాయతీ ఎన్నికలు జరిగే వరకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. పంచాయతీల అభివృద్ధికి అధికారుల ద్వారా పాలన సాగుతుందని చెప్పారు. ప్రకాశం జిల్లాలోని 27 మండలాల్లో 519 పంచాయతీలు, మార్కాపురం జిల్లాలో 21 మండలాలకు 405 మంది అధికారులు ఉంటారన్నారు.

News March 17, 2026

2 నెలల పాపకు పేరు పెట్టిన ప్రకాశం JC

image

కురిచేడు మండలానికి చెందిన చెంచు కుటుంబాలు 29 మంది నాగర్ కర్నూలు (D) బొగ్గుల బట్టిలో పదేళ్లుగా బానిస కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ విషయం స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. <<19399497>>స్పందించిన అధికారులు<<>> సోమవారం వీరిని కలెక్టర్ రాజాబాబు దగ్గర హాజరుపరిచారు. కలెక్టర్ వీరికి పునరావాస చర్యలు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. కార్మికుల్లో ఓ దంపతుల 2 నెలల పాపకు JC ” ప్రేరణ” అని నామకరణం చేశారు.

News March 17, 2026

దోర్నాల: పులులు సంచరించే ప్రదేశం.. జాగ్రత్త

image

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాల సందర్భంగా దోర్నాల–శ్రీశైలం రహదారిలో ఈ నెల 20వ వరకు రాత్రి వేళల్లోనూ వాహన రాకపోకలకు అటవీశాఖ అధికారులు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మార్గం పులుల అభయారణ్యం గుండా వెళ్లడంతో, రాత్రి సమయంలో పులులు సహా, అడవి జంతువులు రోడ్డు దాటే అవకాశం ఎక్కువగా ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వేగం తగ్గించి జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.