News November 19, 2025
నేడు పుట్టపర్తికి ప్రధాని.. షెడ్యూల్ ఇదే..!

శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఇవాళ ప్రధాని మోదీ పుట్టపర్తికి రానున్నారు. ఉదయం 10 గంటలకు ప్రశాంతి నిలయం చేరుకుని, బాబా మహా సమాధిని సందర్శిస్తారు. 10:30 గంటలకు జరిగే శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా సత్యసాయి బాబా గౌరవార్థం ఒక స్మారక నాణెం, ప్రత్యేక స్టాంపులను విడుదల చేసి, సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి నుంచి తమిళనాడులోని కోయంబత్తూరుకు బయలుదేరి వెళతారు.
Similar News
News March 18, 2026
కడప జిల్లాలో రైతుల నుంచి వసూళ్లు ఎంత..?

కడప జిల్లాలో రైతుల నుంచి MSPతో పంటల కొనుగోలు కోసం మార్క్ ఫెడ్ 21 ప్రొక్యూర్ మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 5,732 మంది శనగ రైతులు వీటిలో రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 3,143 మంది రైతుల నుంచి 13,078.5 మెట్రిక్ టన్నుల శనగలు కొనుగోలు చేశారు. బస్తాకు రూ.150 – రూ.200లు మామూళ్లు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ లెక్కన రూ.3, 4 కోట్లు వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
News March 18, 2026
పెద్దపల్లి జిల్లాలో వరి సాగుకు సమృద్ధిగా నీరు

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా వరి సాగుకు రైతన్నలకు యాసంగి పంటకు నీటి కొరత లేకుండా ఉంది. గతేడాది కురిసిన వర్షాలతో చెరువులు, కుంటల్లో నీరు సమృద్ధిగా ఉండడంతోపాటు SRSP నీరు విడుదల చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 2.80 లక్షల ఎకరాల్లో రైతన్నలు వరి సాగు చేశారు. కాగా ఇందుకు సంబంధించి 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
News March 18, 2026
నల్గొండ: రేషన్ ఇచ్చే గడువు పొడిగింపు

నల్గొండ జిల్లాలో రేషన్ కార్డు లబ్ధిదారులకు ఈనెల 19 వరకు రేషన్ తీసుకునే గడువును పొడిగించినట్లు పౌరసరఫరాల శాఖ ఎన్ ఫోర్స్మెంట్ డిప్యూటీ తహశీల్దార్ రఘునందన్ తెలిపారు. డీలర్లు షాపులను సమయానికి తెరిచి ఉంచాలని ఆదేశించారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.


