News November 19, 2025

పెద్దారవీడు వద్ద ఎద్దుల అరకలను ఢీకొని దోర్నాల వ్యక్తి మృతి

image

పెద్దారవీడు మండలం బద్వీడు చెర్లోపల్లి సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వెళ్తున్న ఎద్దుల అరకలను ద్విచక్రవాహనం ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. వారిని మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు దోర్నాల మండలం యడవల్లికి చెందిన నల్లబోతుల శివగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 30, 2026

ప్రకాశం: పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

image

పొన్నలూరు మండలం నాగిరెడ్డిపాలెం సమీపంలో సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకువెళ్లింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కందుకూరు నుంచి పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు స్టీరింగ్ పట్టుకోవడంతో డ్రైవర్ బస్సును మార్జిన్ దించి పొలాల్లోకి తీసుకెళ్లాడు. బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

News March 30, 2026

ప్రకాశం: పోలీస్ ప్రజా ఫిర్యాదుల వేదికలో 61 అర్జీలు

image

ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమానికి 61 ఫిర్యాదులు అందాయి. ప్రజా సమస్యలను ఆలస్యం లేకుండా విచారించి బాధితులకు వేగంగా న్యాయం అందించాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశించారు. అందిన ఫిర్యాదులపై వెంటనే విచారణ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వృద్ధులు, బాధితుల సమస్యలను ప్రత్యేకంగా పరిగణించాలని తెలిపారు.

News March 30, 2026

ప్రకాశం: పోలీస్ ప్రజా ఫిర్యాదుల వేదికలో 61 అర్జీలు

image

ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమానికి 61 ఫిర్యాదులు అందాయి. ప్రజా సమస్యలను ఆలస్యం లేకుండా విచారించి బాధితులకు వేగంగా న్యాయం అందించాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశించారు. అందిన ఫిర్యాదులపై వెంటనే విచారణ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వృద్ధులు, బాధితుల సమస్యలను ప్రత్యేకంగా పరిగణించాలని తెలిపారు.