News November 19, 2025
సంగారెడ్డి: 20న నిరుద్యోగులకు జాబ్ మేళా

SRD జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సెర్ఫ్ (EGMM) ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారిణి జ్యోతి తెలిపారు. ఈ మేరకు సంగారెడ్డిలోని పాత డీఆర్డీఏ కార్యాలయం బైపాస్ రోడ్లో 20న ఉదయం 10 గంటలకు మేళా జరుగుతుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం 99664 64500 నంబర్ను సంప్రదించాలన్నారు.
Similar News
News March 29, 2026
సమన్వయంతోనే ఆహార శుద్ధి రంగ అభివృద్ధి: కలెక్టర్

చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆహార శుద్ధి రంగ అభివృద్ధికి సమన్వయం అత్యంత అవసరమని సూచించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఫుడ్ ప్రాసెసర్ అసోసియేషన్ సౌత్ జోన్ ఛైర్మన్గా రెండోసారి ఎన్నికైన కట్టమంచి బాబీని సత్కరించారు. పరిశ్రమలు, రైతుల మధ్య పటిష్టమైన సమన్వయం ఉండాలన్నారు. కార్యక్రమంలో తలుపులపల్లి బాబురెడ్డి, శివకుమార్, శివారెడ్డి మరియు అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
News March 29, 2026
చిత్తూరు కలెక్టరేట్లో రేపు పీజీఆర్ఎస్

చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరగనుందని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించే కార్యక్రమంలో జిల్లాస్థాయి అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. సమస్యలు ఉన్నవారు https://Meekosam.ap.gov.in వెబ్సైట్లోనూ అర్జీలు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. వినతుల స్థితిని 1100 నెంబర్ లో తెలుసుకోవచ్చని చెప్పారు.
News March 29, 2026
IPL: ధోనీ ఫ్యాన్స్కు బ్యాడ్న్యూస్

ఐపీఎల్-2026లో తొలి రెండు వారాల్లో జరిగే మ్యాచులకు ధోనీ దూరమైనట్లు CSK ఇటీవల ప్రకటించింది. కానీ ఆయన ఏప్రిల్ చివరి వారం వరకూ మ్యాచులు ఆడకపోవచ్చని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. కండరాల గాయంతో బాధపడుతున్న ఆయన దాదాపు 6 మ్యాచులకు దూరం కానున్నట్లు టీమ్ వర్గాలు చెప్పినట్లు తెలిపాయి. కాగా CSK రేపు RR, ఏప్రిల్ 3న PBKS, 5న RCB, 11న DC, 14న KKR, 18న SRH, ఏప్రిల్ 23న MIతో తలపడనుంది.


