News April 13, 2024
IPL: నేడు పంజాబ్ VS రాజస్థాన్

IPL-2024లో భాగంగా ఇవాళ పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. చండీగఢ్లోని ముల్లన్పూర్ వేదికగా రాత్రి 7:30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఈ రెండు జట్లు 26 మ్యాచుల్లో తలపడగా RR 15 విజయాలు సాధించింది. PBKS 11 మ్యాచుల్లో గెలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్ 8 పాయింట్లతో టాప్లో ఉండగా, పంజాబ్ 4 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. నేడు గెలుపెవరిది? కామెంట్ చేయండి.
Similar News
News January 19, 2026
న్యూజిలాండ్కు T20WC గెలిచే అవకాశాలు: వాన్

వచ్చే నెలలో జరిగే టీ20 వరల్డ్కప్ గెలిచే అవకాశాలు న్యూజిలాండ్కు ఎక్కువగా ఉన్నాయని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ అంచనా వేశారు. ఆ జట్టులోని ప్లేయర్లకు ఆ సామర్థ్యం ఉందని అభిప్రాయపడ్డారు. కాగా ఈ నెల 21 నుంచి న్యూజిలాండ్ టీమ్ ఇండియాతో 5 టీ20ల సిరీస్ ఆడనుంది. ప్రస్తుతం టీ20ల్లో తొలి ర్యాంకులో భారత్ ఉండగా NZ 4వ ర్యాంకులో కొనసాగుతోంది. దీంతో WC ముందు ఈ సిరీస్ విజయం ఇరు జట్లకు కీలకమే.
News January 19, 2026
మళ్లీ నేల చూపులే.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 615 పాయింట్లు కోల్పోయి 82,955 వద్ద, నిఫ్టీ 182 పాయింట్లు నష్టపోయి 25,512 వద్ద కొనసాగుతున్నాయి. ICICI బ్యాంక్(3.45%), రిలయన్స్(2.3%), ఇన్ఫోసిస్(1.18%) నష్టపోగా, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్(3.73%), TECHM(3.66%), మారుతీ సుజుకీ(1.3%) లాభాల్లో ట్రేడవుతున్నాయి. యూరప్ దేశాలపై ట్రంప్ టారిఫ్స్ ప్రభావం మార్కెట్లపై పడిందని ఎక్స్పర్టులు అంటున్నారు.
News January 19, 2026
50 వేల మంది ఉద్యోగులను తీసుకుంటాం: డెలాయిట్

గ్లోబల్ సంస్థ డెలాయిట్ గుడ్న్యూస్ చెప్పింది. ఇండియాలో 50 వేల మంది ఉద్యోగులను నియమించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ‘ఇండియాలో 1.4 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రపంచంలోని ప్రతి నలుగురు డెలాయిట్ ఉద్యోగుల్లో ఒకరు ఇండియన్. మరో 50 వేల మందికిపైగా తీసుకుంటాం. సంస్థ విస్తరణ కోసం మంగళూరు(KA)లో బ్రాంచ్ ఏర్పాటు చేస్తాం’ అని కంపెనీ సౌత్ ఆసియా సీఈవో రోమల్ శెట్టి ఓ కార్యక్రమంలో తెలిపారు.


