News April 13, 2024
వారికి త్వరలో జీతాలు: ప్రభుత్వం

TG: రాష్ట్రంలో కొత్తగా నియమితులైన నర్సింగ్ ఆఫీసర్లకు త్వరలో జీతాలు అందజేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఫిబ్రవరిలో డీఎంఈ విభాగంలో మొత్తం 5,600 మంది విధుల్లో చేరారని పేర్కొంది. వారికి ఎంప్లాయ్ ఐడీ, పీఆర్ఏఎన్ నంబర్ కేటాయించే ప్రక్రియ జరుగుతోందని, త్వరలోనే ఆ ప్రక్రియను పూర్తిచేసి వేతనాలు ఇస్తామని వెల్లడించింది.
Similar News
News March 13, 2026
వంటగ్యాస్.. దేశ ప్రజలకు కేంద్రం సూచన

దేశవ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వంటగ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్రం తెలిపింది. ప్రజలు ఆందోళన పడి పానిక్ బుకింగ్ చేసుకోవద్దని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో పంపిణీని పర్యవేక్షించాలంది. టీవీలు పదేపదే పాత విజువల్స్ను చూపించవద్దని కోరింది. డేట్ వేసి విజువల్స్ ప్రసారం చేయాలని, దీనివల్ల ప్రజలకు కచ్చితమైన సమాచారం చేరుతుందని తెలిపింది.
News March 13, 2026
నెలసరి సెలవులతో మహిళలకే నష్టం కలగొచ్చు: సుప్రీంకోర్టు

నెలసరి సెలవులను తప్పనిసరి చేస్తే మహిళల కెరీర్పై ప్రభావం చూపొచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సంస్థలు మహిళల నియామకానికి ప్రాధాన్యం తగ్గించొచ్చని.. ఫలితంగా వర్క్ఫోర్స్లో వారి వాటా తగ్గొచ్చని తెలిపింది. ఇలాంటి పిటిషన్లు యువతుల్లో తాము కొన్నిసార్లు పురుషులతో సమానంగా పనిచేయలేమనే అభిప్రాయం కలిగిస్తాయని పేర్కొంది. కేంద్రం ఈ విషయాన్ని పరిశీలించాలని సూచిస్తూ సంబంధిత రిట్ పిటిషన్ను కొట్టివేసింది.
News March 13, 2026
ఈ నొప్పులతో థైరాయిడ్ను ముందుగానే గుర్తించొచ్చు

శరీరంలో కొన్నిభాగాల్లో వచ్చే నొప్పులు థైరాయిడ్ అసమతుల్యతకు సూచన అని నిపుణులు అంటున్నారు. సాధారణంగా థైరాయిడ్ హార్మోన్లలో అసమతుల్యత ఉంటే ఎముకలను బలహీనపరుస్తుంది. ఇది వివిధ ప్రదేశాలలో నొప్పికి దారితీస్తుంది. మెడ, దవడ, చెవి నొప్పులు తరచూ వస్తుంటే థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం మంచిది. వీటితో పాటు కండరాల నొప్పి, కీళ్లు, మోకాళ్ల నొప్పి ఎక్కువగా వస్తున్నా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.


