News November 19, 2025
KMR: నేటి నుంచి పత్తి కొనుగోళ్లు పునఃప్రారంభం: కలెక్టర్

కామారెడ్డి జిల్లాలోని పత్తి రైతులు బుధవారం నుంచి CCI కేంద్రాలకు పత్తిని తీసుకువెళ్లాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి సమస్యల పరిష్కారానికి మంగళవారం ఆయన కీలక సమావేశం నిర్వహించారు. మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు జిన్నింగ్ మిల్లర్లతో చర్చించారు. హామీలను నెరవేరుస్తామని చెప్పడంతో మిల్లుల యజమానులు బంద్ విరమించారని కలెక్టర్ తెలిపారు.
Similar News
News March 15, 2026
ఎన్నికల వే‘ఢీ’.. సమ్మర్లో సమరమే!

4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల <<19389988>>షెడ్యూల్తో<<>> వేసవిలో ఎలక్షన్ వే‘ఢీ’ మొదలైంది. అస్సాం మినహా మూడింట(TN, బెంగాల్, కేరళం) BJPయేతర ప్రభుత్వాలే ఉండటంతో సమరం రంజుగా సాగనుంది. ఆయా రాష్ట్రాల్లో పట్టు సాధించాలని BJP చూస్తుండగా మరోసారి ప్రభుత్వాలను నిలబెట్టుకోవాలని స్టాలిన్, మమత, విజయన్ పోరాడుతున్నారు. నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పార్టీల ప్రచారాలు, రాజకీయ విమర్శలతో ఈసమ్మర్ హాట్హాట్గా సాగనుంది.
News March 15, 2026
తాళ్లపాలెం నుంచి యూటర్న్ తీసుకున్న పెద్దపులి

ఆదివారం రాత్రి మరోసారి పెద్ద పులి యూటర్న్ తీసుకుంది. తాళ్లపాలెంలో మకాం వేసిన పులి రాత్రి మండపం నుంచి శంఖవరం వచ్చే రహదారిలో మాజీ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ ఇంటి సమీపంలో తిష్ఠ వేసిందని అధికారులు తెలిపారు. శంకవరం-మండపం రోడ్డులో బ్రిడ్జి సమీపంలో ఇది ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. అటవీ శాఖ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు.
News March 15, 2026
రాజంపేట RTC బస్టాండ్లో ప్రయాణికుల తిప్పలు

తిరుపతి వెళ్లడానికి ఆదివారం సాయంత్రం బస్సులు లేకపోవడంతో అవస్థలు పడ్డామని ప్రయాణికులు ఆరోపించారు. 2 గంటల సేపు వేచిఉన్న తర్వాత వేరే డిపో బస్సు వచ్చిందన్నారు. అది కూడా అధిక ప్రయాణికులతో నిండుగా రావడంతో సీట్లు లేక నిలబడి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. రాజంపేట డిపో నుంచి తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్, శ్రీశైలానికి రాత్రి పూట లగ్జరీ/ఏసీ బస్సులను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.


