News November 19, 2025

నేడు పుట్టపర్తికి ప్రధాని.. షెడ్యూల్ ఇదే..!

image

శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఇవాళ ప్రధాని మోదీ పుట్టపర్తికి రానున్నారు. ఉదయం 10 గంటలకు ప్రశాంతి నిలయం చేరుకుని, బాబా మహా సమాధిని సందర్శిస్తారు. 10:30 గంటలకు జరిగే శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా సత్యసాయి బాబా గౌరవార్థం ఒక స్మారక నాణెం, ప్రత్యేక స్టాంపులను విడుదల చేసి, సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి నుంచి తమిళనాడులోని కోయంబత్తూరుకు బయలుదేరి వెళతారు.

Similar News

News March 20, 2026

గోదావరి నదిలో గల్లంతైన వారి వివరాలు ఇవే..!

image

ఎటపాక మండలం పురుషోత్తపట్నం వద్ద గోదావరి నదిలో <<19432323>>గల్లంతైన<<>> ఐదుగురు యువకులు అమరావతిలోని ఎస్ఆర్ఎం కాలేజీలో ఇంజినీరింగ్ విద్యార్థులుగా పోలీస్ అధికారులు చెప్తున్నారు. సతీశ్(మదనపల్లి), నవదీప్ (ఉయ్యూరు), తేజజ్ఞ(ఉయ్యూరు), శ్రీకర్(భద్రాచలం), అభిరామ్(విజయనగరం) అని తేల్చారు. వీరంతా బీటెక్ సెకండియర్ చదువుకుంటున్నారన్నారు. ఏడుగురు గోదావరిలోకి దిగగా ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారన్నారు.

News March 20, 2026

‘పోలవరం జిల్లాలో గ్యాస్ కొరత లేదు’

image

పోలవరం జిల్లాలోని 8గ్యాస్ ఏజెన్సీలలో 1872 వంట గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్ విజయ భాస్కర్ శుక్రవారం తెలిపారు. రంపచోడవరంలో జీసీసీ గ్యాస్ గోడౌన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ బుక్ ప్రకారం 352 సిలిండర్లు సక్రమంగా ఉన్నాయని తెలిపారు. ఎటువంటి కొరతలేదని, బ్లాక్ మార్కెట్‌కి తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. శుక్రవారం 352 మంది గ్యాస్‌ కోసం నమోదు చేసుకున్నారన్నారు.

News March 20, 2026

పండుగలు సమాజానికి కళాశోభను ఇస్తాయి: చిత్రకారుడు రుస్తుం

image

పండుగలు సమాజాలను కళావంతం చేస్తాయని అంతర్జాతీయ చిత్రకారుడు రుస్తుం అన్నారు. శుక్రవారం సిద్దిపేటలో ఆయన గీసిన ‘రంజాన్ ముబారక్’ చిత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పండుగ సోదరభావానికి, సామరస్యానికి ప్రతీక అని కొనియాడారు. సమాజంలో ధనవంతులు పేదవారి ఆకలిని గుర్తించి చేయూతనివ్వాలని కోరారు. పవిత్ర ఖురాన్ మార్గంలో నడుస్తూ అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.