News November 19, 2025

నిజామాబాద్: 23 మందికి రూ.2.36 లక్షల జరిమానా

image

నిజామాబాద్‌ డివిజన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 30 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారిని మంగళవారం జిల్లా మార్నింగ్ కోర్టులో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట హాజరుపరిచారు. వారిలో 23 మందికి రూ.2.36 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చింది. మరో ఏడుగురికి జైలు శిక్ష పడింది. అంతకు ముందు వారికి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

Similar News

News March 19, 2026

NZB: 89 మంది సభ్యులతో DCC నూతన కార్యవర్గం

image

నూతనంగా 89 మందితో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గాన్ని గురువారం విస్తరించారు. ఇప్పటికే గత డిసెంబర్లో డీసీసీ అధ్యక్షునిగా కాటిపల్లి నగేష్ రెడ్డిని నియమించిన TPCC గురువారం పూర్తి స్థాయి కమిటీని ప్రకటించింది. ఇందులో 12 మందిని ఉపాధ్యక్షులుగా, 24 మందిని ప్రధాన కార్యదర్శులుగా, నలుగురిని అధికార ప్రతినిధులుగా, 48 మందిని కార్యదర్శులుగా ప్రకటించారు.

News March 19, 2026

నిజామాబాద్: ‘SSC పేపర్ లీక్.. 9 మంది సిబ్బందిపై వేటు’

image

10th పరీక్షల్లో నిబంధనలు ఉల్లంఘించిన 9మంది సిబ్బందిపై నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి చర్యలు తీసుకున్నారు. బుధవారం జరిగిన 2వ భాష (హిందీ/తెలుగు) ప్రశ్నపత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే ఇందుకు కారణం.​ ఆలూరు, మెండోరా, బోధన్ పరిధిలోని పరీక్షాకేంద్రాల నుంచి ఈ పేపర్లు బయటకు వచ్చినట్లు విచారణలో తేలింది. దీంతో 9మంది సిబ్బందిని విధుల్లో నుంచి తొలగించి సస్పెన్షన్ వేటువేస్తూ DEO ఉత్తర్వులు జారీ చేశారు.

News March 19, 2026

నిజామాబాద్: ‘SSC పేపర్ లీక్.. 9 మంది సిబ్బందిపై వేటు’

image

10th పరీక్షల్లో నిబంధనలు ఉల్లంఘించిన 9మంది సిబ్బందిపై నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి చర్యలు తీసుకున్నారు. బుధవారం జరిగిన 2వ భాష (హిందీ/తెలుగు) ప్రశ్నపత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే ఇందుకు కారణం.​ ఆలూరు, మెండోరా, బోధన్ పరిధిలోని పరీక్షాకేంద్రాల నుంచి ఈ పేపర్లు బయటకు వచ్చినట్లు విచారణలో తేలింది. దీంతో 9మంది సిబ్బందిని విధుల్లో నుంచి తొలగించి సస్పెన్షన్ వేటువేస్తూ DEO ఉత్తర్వులు జారీ చేశారు.