News November 19, 2025

నేడే రైతు ఖాతాలో 2వ విడత నగదు జమ: కలెక్టర్

image

అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత కింద ఇవాళ (మంగళవారం) రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేయనుందని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలు, రైతు సేవా కేంద్రాల్లో అన్నదాత సుఖీభవ పథకం కార్యక్రమం జరిగేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులను టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆమె ఆదేశించారు.

Similar News

News March 22, 2026

సజావుగా గ్యాస్ సరఫరా: కలెక్టర్

image

ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఎల్పీజీ సరఫరాపై ఎలాంటి అంతరాయం లేదని కర్నూలు కలెక్టర్ సిరి తెలిపారు. జిల్లాలో రోజుకు 11వేల సిలిండర్ల అవసరానికి గాను 18వేల సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. 42 గ్యాస్ ఏజెన్సీలపై ప్రత్యేక నిఘా పెట్టి సరఫరా పర్యవేక్షిస్తున్నామన్నారు. వినియోగదారులు ఆందోళన చెందకుండా అవసరానికి మించి బుకింగ్‌లు చేయవద్దని సూచించారు.

News March 22, 2026

కర్నూలులో 23న ప్రజా ఫిర్యాదుల వేదిక: కలెక్టర్

image

ఈ నెల 23 (సోమవారం)న కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. జిల్లాలోని అన్ని మండల రెవెన్యూ, డివిజనల్, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. అర్జీల స్థితి తెలుసుకోవడానికి 1100 కాల్ సెంటర్‌కు ఫోన్ చేయవచ్చన్నారు. అలాగే Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు నమోదు చేసుకోవచ్చని సూచించారు.

News March 22, 2026

కర్నూలు: ప్రమాదంలో 19 ఏళ్ల యువకుడి మృతి

image

గోనెగండ్ల మండలం వేముగోడులో మధ్యాహ్నం విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. రవిరెడ్డి పొలంలో కాంట్రాక్టర్ బావన్న నీళ్ల బావిని JCBతో తవ్వుతూ మట్టిని ట్రాక్టర్‌లో నింపుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో ట్రాక్టర్ ట్రాలీ, ఇంజన్‌కు మధ్య ఉన్న లింక్ తెగిపోయింది. దీంతో ట్రాక్టర్‌పై కూర్చున్న సాదిక్ బాషా(19) తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.