News November 19, 2025
నేడు బాపట్ల జిల్లా రైతుల ఖాతాల్లో రూ.107.21కోట్లు జమ!

బాపట్ల జిల్లాలోని సుమారు 1,60,441 రైతుల అకౌంట్లలోకి అన్నదాత సుఖీభవ 2వ విడత రూ.5,000, పీఎం కిసాన్ 21వ విడత రూ.2,000 కలిపి మొత్తంగా రూ.7,000లు బుధవారం జమ కానున్నాయి. ఈ మేరకు జిల్లా ఇన్ఛార్జి డీఏవో కె.అన్నపూర్ణమ్మ వివరాలను మంగళవారం వెల్లడించారు. జిల్లాలోని 25 మండలాల్లోని రైతులకు రూ.107.21 కోట్ల లబ్ధి చేకూరనున్నట్లు ఆమె తెలిపారు.
Similar News
News March 19, 2026
మంత్రి పదవి నాకు కొత్త కాదు: గంటా

మంత్రి పదవి తనకు కొత్త కాదని, గతంలోనూ ఆ బాధ్యతలు నిర్వహించానని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం సంపత్ వినాయక ఆలయాన్ని దర్శించుకున్న ఆయన.. మంత్రివర్గ విస్తరణ వార్తలపై స్పందించారు. ఎవరిని మంత్రిగా తీసుకోవాలో సీఎం చంద్రబాబుకు పూర్తి స్పష్టత ఉంటుందని, సరైన సమయంలో ఆయన సరైన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ప్రస్తుతానికి ఈ వార్తలన్నీ ఊహాగానాలేనని గంటా స్పష్టం చేశారు.
News March 19, 2026
ప.గో: 19 రోజుల తర్వాత స్వదేశానికి భౌతికకాయం

పాలకొల్లు డామ్ పేటకు చెందిన కందికట్ల రాకేష్ (26) ఈనెల 1 న కువైట్ దేశంలో అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. యుద్ధం నేపథ్యంలో విమానాల రాకపోకలు లేకపోవడంతో కువైట్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాన్ని భద్రపరిచారు. ఇండియన్ ఎంబసీ చొరవతో పోస్ట్ మార్టం అనంతరం 19 రోజుల తర్వాత మృతదేహాన్ని గురువారం కార్గో విమానంలో హైదరాబాద్ తరలించనున్నారు. శుక్రవారం పాలకొల్లు చేరనుంది.
News March 19, 2026
రాజంపేట: వర్షంతో రైతులకు నష్టం

రాజంపేట మండలంలో బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. హస్తవరం, చెర్లోపల్లి, కొత్తపల్లి, ఆకేపాడు తదితర గ్రామాల్లో వేల ఎకరాల్లో అరటి పంటలు నేలకొరిగాయి. పంట కోత దశలో ఉండగా, ఒకే రాత్రిలో నాశనం కావడంతో రైతులు ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, నష్టపోయిన పంటలపై సర్వే చేసి నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.


