News November 19, 2025
మెదక్: తండ్రి దాడిలో గాయపడ్డ వంశీని పరామర్శించిన కలెక్టర్

మెదక్ జిల్లా కేంద్రంలోని మాత శిశు సంక్షేమ కేంద్రంలో చికిత్స పొందుతున్న వంశీని కలెక్టర్ రాహుల్ రాజ్ పరామర్శించారు. రామాయంపేట మండలం అక్కన్నపేటలో మద్యం మత్తులో తండ్రి కొడుకు వంశీపై దాడి చేయడంతో తీవ్ర గాయాలైన ఘటన తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వంశీ వద్దకు వెళ్లి కలెక్టర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు.
Similar News
News March 16, 2026
అంగన్వాడీల అరెస్టులు దుర్మార్గం: సీఐటీయూ

అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం వారిని అక్రమ అరెస్టులకు పాల్పడటంపై సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం మండిపడ్డారు. సోమవారం ఇందిరా పార్కు వద్ద ధర్నాకు వెళ్తున్న అంగన్వాడీలను దారిలోనే అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ వేదికగా సమస్యలపై చర్చించి, వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హక్కుల కోసం పోరాడుతుంటే అణచివేయడం సరికాదన్నారు.
News March 16, 2026
మెదక్: నేటి ‘ప్రజావాణి’ వాయిదా

మెదక్ జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. జనాభా గణన–2027 విధుల్లో అధికారులు నిమగ్నమైనందున నేడు కలెక్టరేట్తో పాటు మండల స్థాయి కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం ఉండదు. జిల్లా ప్రజలు ఈ మార్పును గమనించి అధికారులకు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
News March 16, 2026
మెదక్: నేటి ‘ప్రజావాణి’ వాయిదా

మెదక్ జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. జనాభా గణన–2027 విధుల్లో అధికారులు నిమగ్నమైనందున నేడు కలెక్టరేట్తో పాటు మండల స్థాయి కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం ఉండదు. జిల్లా ప్రజలు ఈ మార్పును గమనించి అధికారులకు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.


