News November 19, 2025

సంగారెడ్డి: వాహనాలు జాగ్రత్తగా నడిపించాలి: ఎస్పీ

image

ఉదయం సమయంలో వాహనాలను జాగ్రత్తగా నడిపించాలని ఎస్పీ పారితోష్ పంకజ్ తెలిపారు. ఉదయం 8 గంటల వరకు పొగ మంచు పడుతున్నందున ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవచ్చని చెప్పారు. ఉదయం సమయంలో సాధ్యమైనంత వరకు బయటకు రాకపోవడమే మంచిదని పేర్కొన్నారు. వాహనాల హెడ్ లైట్లు ఇండికేటర్లు తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. కార్లలో వెళ్లేవారు తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలన్నారు.

Similar News

News March 27, 2026

ఖమ్మం: వరి కోతకు వచ్చి గుండెపోటుతో డ్రైవర్ మృతి

image

నేలకొండపల్లి మండలం చెరువు మాదారం గ్రామంలో శుక్రవారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. వరి కోత మిషన్‌తో పనుల కోసం వచ్చిన ఓ డ్రైవర్, స్థానిక పెట్రోల్ బంక్ వద్ద ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పనుల కోసం వచ్చి అనంత లోకాలకు వెళ్లడంతో తోటి కార్మికులు కన్నీరుమున్నీరయ్యారు.

News March 27, 2026

‘వేదమందిర్’కు జ్యోతిష్కులు కావలెను!

image

ప్రముఖ ఆధ్యాత్మిక వేదిక ‘వేదమందిర్’ సేవలు మరింత విస్తరించేందుకు జ్యోతిష్కులను నియమించుకుంటోంది. మా లక్షలాది తెలుగు భక్తులకు సరైన మార్గదర్శనం చేసేందుకు నిపుణులైన జ్యోతిష్కులు (Astrologers) కావలెను.
– జ్యోతిషశాస్త్రంలో మంచి పట్టు
– విషయంపై స్పష్టమైన వివరణ ఇచ్చే నైపుణ్యం
మీరు జ్యోతిష్యంలో ప్రావీణ్యం ఉన్నవారైతే వెంటనే సంప్రదించండి!
<<7337592828>>Click on Whatsapp <<>>

News March 27, 2026

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రికెట్ జట్ల ఎంపిక పూర్తి

image

ఏలూరు ఆశ్రమం మెడికల్ కళాశాల మైదానంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అండర్ 19, అండర్ 23 బాలుర క్రికెట్ జట్ల ఎంపిక జరిగింది. ఎంపిక పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అండర్ 23 జట్టులో 23 మంది సభ్యులు, అండర్ 19 జట్టులో 16 మంది సభ్యులను సెలెక్టర్లు ఎంపిక చేశారు. వీరు త్వరలో మూలపాడులో జరగబోయే అంతర్ జిల్లాల క్రికెట్ పోటీల్లో పాల్గొంటారని సెలెక్టర్ శ్రీనివాసరాజు వెల్లడించారు.