News November 19, 2025

సంగారెడ్డి: వాహనాలు జాగ్రత్తగా నడిపించాలి: ఎస్పీ

image

ఉదయం సమయంలో వాహనాలను జాగ్రత్తగా నడిపించాలని ఎస్పీ పారితోష్ పంకజ్ తెలిపారు. ఉదయం 8 గంటల వరకు పొగ మంచు పడుతున్నందున ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవచ్చని చెప్పారు. ఉదయం సమయంలో సాధ్యమైనంత వరకు బయటకు రాకపోవడమే మంచిదని పేర్కొన్నారు. వాహనాల హెడ్ లైట్లు ఇండికేటర్లు తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. కార్లలో వెళ్లేవారు తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలన్నారు.

Similar News

News March 5, 2026

ASF: విద్యుత్ ద్వారా ప్రభుత్వానికి రూ. కోటి ఆదాయం

image

ASF జిల్లాలో వేసవి ప్రారంభంలోనే ఎండలు తీవ్రరూపం దాల్చాయి. ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల సెల్సియస్‌కు చేరడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. ఈనెల 3న రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 19,900 మెగావాట్ల వినియోగం నమోదైంది. జిల్లాలో 1,737 మెగావాట్ల వినియోగం జరిగినట్లు అధికారులు తెలిపారు. రోజుకు 17.35 లక్షల యూనిట్లు వినియోగమవుతూ ప్రభుత్వానికి సుమారు రూ. కోటి ఆదాయం లభిస్తోంది.

News March 5, 2026

కృష్ణా వర్శిటీ విద్యార్థులకు అలర్ట్

image

కృష్ణా యూనివర్శిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో బీఈడీ, స్పెషల్ బీఈడీ, బీపీఈడీ, డీపీఈడీ చదివే విద్యార్థులు రాయాల్సిన 1, 2,3,4వ సెమిస్టర్(వన్ టైం ఆపర్చునిటీ) పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 6 మధ్య నిర్ణీత తేదీలలో వర్శిటీ పరిధిలోని కళాశాలలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU అధ్యాపకులు తెలిపారు. సబ్జెక్టువారీగా టైం టేబుల్ పూర్తి వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడాలని కోరారు.

News March 5, 2026

ముగ్గురు సహచరులు – ఒక్కటే లక్ష్యం: నారా లోకేశ్

image

2024 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీలు సాధించిన ముగ్గురు నేతల (లోకేశ్, పల్లా, గంటా శ్రీనివాసరావు) అరుదైన ఫొటోను మంత్రి నారా లోకేశ్ పంచుకున్నారు. అత్యధిక ఓట్ల మెజారిటీ పొందిన ముగ్గురు సహచరులుగా.. ఈ గెలుపు తమపై ఉన్న గురుతర బాధ్యతను గుర్తు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రతిరోజూ పూర్తి నిబద్ధతతో, వినమ్రతతో ప్రజలకు సేవ చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు.