News November 19, 2025

సంగారెడ్డి: వాహనాలు జాగ్రత్తగా నడిపించాలి: ఎస్పీ

image

ఉదయం సమయంలో వాహనాలను జాగ్రత్తగా నడిపించాలని ఎస్పీ పారితోష్ పంకజ్ తెలిపారు. ఉదయం 8 గంటల వరకు పొగ మంచు పడుతున్నందున ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవచ్చని చెప్పారు. ఉదయం సమయంలో సాధ్యమైనంత వరకు బయటకు రాకపోవడమే మంచిదని పేర్కొన్నారు. వాహనాల హెడ్ లైట్లు ఇండికేటర్లు తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. కార్లలో వెళ్లేవారు తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలన్నారు.

Similar News

News April 10, 2026

మళ్లీ వర్షం.. మ్యాచ్ మరింత ఆలస్యం

image

గువాహటి స్టేడియం వద్ద మళ్లీ చిరుజల్లులు మొదలయ్యాయి. పిచ్‌ను సిబ్బంది కవర్లతో కప్పేశారు. దీంతో RCB-RR మ్యాచ్ మరింత ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే RR టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

News April 10, 2026

కేసుల దర్యాప్తులో ఆధునిక సాంకేతికను ఉపయోగించండి: ఎస్పీ

image

కేసుల దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని పోలీసు సిబ్బందికి ఎస్పీ సునీల్ షొరాణ్ సూచించారు. శుక్రవారం నంద్యాల జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. కేసుల ఛేదనలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన 36 మందిని అభినందిస్తూ ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో నంద్యాల ఏఎస్పీ ఎం.జావళి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

News April 10, 2026

ఇరాన్ పాకిస్థాన్‌కు వెళ్లడం డౌటే?

image

USతో శాంతి చర్చల విషయంలో ఇరాన్ ప్రభుత్వంలో విభేదాలు తలెత్తినట్లు సమాచారం. పాక్ వేదికగా జరగాల్సిన ఈ చర్చలకు వెళ్లాలని ఓ వర్గం వాదిస్తుంటే, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపే వరకు చర్చల్లేవని మరో వర్గం అంటున్నట్లు తెలుస్తోంది. ఈ అంతర్గత కలహాల మధ్య ఇరాన్ ప్రతినిధుల బృందం ఇంకా ఇస్లామాబాద్ చేరుకోలేదని ఆ దేశ అధికారిక మీడియా తెలిపింది. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ ఇప్పటికే పాక్ పయనమయ్యారు.