News November 19, 2025
కలెక్టర్ హెచ్చరిక

ప్రతి సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజలు ఇచ్చే దరఖాస్తులను ఆన్లైన్ చేసి వారికి రసీదు ఇవ్వాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. మంగళవారం నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో తహశీల్దార్లతో పలు రెవెన్యూ అంశాలపై రివ్యూ నిర్వహించారు. పీజీఆర్ఎస్ అర్జీలను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు.
Similar News
News March 21, 2026
గ్రీన్ 2 ఓవర్లే వేస్తే రూ.2 కోట్లు కట్ చేయాలి: అశ్విన్

KKR ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్పై మాజీ క్రికెటర్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఆయన 2 ఓవర్లే బౌలింగ్ వేస్తే ఫీజు నుంచి రూ.2 కోట్లు కట్ చేయాలి. 4 ఓవర్ల కోటా పూర్తి చేయకపోతే డబ్బును తగ్గించే హక్కు IPL ఫ్రాంచైజీలకు ఉండాలి’ అని అభిప్రాయపడ్డారు. IPLలో గ్రీన్ 4 ఓవర్లు వేయడానికి AUS అనుమతిస్తుందా? అనేది వేచి చూడాలన్నారు. కాగా గాయాలు కాకుండా ఉండేందుకు గ్రీన్కు క్రికెట్ ఆస్ట్రేలియా పరిమితులు విధించింది.
News March 21, 2026
ధర్మపురి: పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త.. భార్య మృతి..!

ప్రేమ పెళ్లి చేసుకుని భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించగా బాధితురాలు చికిత్స పొందుతూ మరణించింది. ధర్మపురికి చెందిన బడుగు నవీన్, మసీదు రమ్య(22) నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకోగా, గొడవల వల్ల 5 నెలలుగా రమ్య తన తల్లి వద్ద ఉంటోంది. ఈ నెల 16న అక్కడికి వెళ్లిన నవీన్ ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వరంగల్ MGMలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు SI మహేష్ తెలిపారు.
News March 21, 2026
సిద్దిపేట: పోలీస్ అధికారికి ఆపరేషన్.. చివరికి మృతి

ఓ పోలీస్ అధికారికి మెదడు ఆపరేషన్ తర్వాత మరణించిన ఘటన HYDలో జరిగింది. సిద్దిపేట కమిషనరేట్కు చెందిన RSI తాళ్లపల్లి రాజ సాంబయ్య చికిత్స కోసం హైటెక్ సిటీలోని ఓ ఆసుపత్రిలో చేరారు. మెదడుకు ఆపరేషన్ చేయగా, పరిస్థితి విషమించి అదే రోజు మరో సర్జరీ చేశారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. భార్య తిరుపతమ్మ ఫిర్యాదుతో మాదాపూర్ పోలీసులు 194 BNSS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


