News November 19, 2025

నేడు పుట్టపర్తికి ప్రధాని.. షెడ్యూల్ ఇదే..!

image

శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఇవాళ ప్రధాని మోదీ పుట్టపర్తికి రానున్నారు. ఉదయం 10 గంటలకు ప్రశాంతి నిలయం చేరుకుని, బాబా మహా సమాధిని సందర్శిస్తారు. 10:30 గంటలకు జరిగే శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా సత్యసాయి బాబా గౌరవార్థం ఒక స్మారక నాణెం, ప్రత్యేక స్టాంపులను విడుదల చేసి, సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి నుంచి తమిళనాడులోని కోయంబత్తూరుకు బయలుదేరి వెళతారు.

Similar News

News November 21, 2025

HYD పోలీసులు మల్టీ ప్లేయర్‌గా పనిచేయాలి: సీపీ

image

నగరంలో ట్రాఫిక్ విభాగం పనితీరు రోజురోజుకు మెరుగుపడుతోందని సీపీ సజ్జనార్ అన్నారు. బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో ఆయన ట్రాఫిక్ విభాగంపై గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. డ్రంక్& డ్రైవ్, మైనర్ డ్రైవింగ్ తదితర ఉల్లంఘనలను ఏ మాత్రం ఉపేక్షించకుండా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. HYD పోలీసులు మల్టీ ప్లేయర్‌గా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

News November 21, 2025

750 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 750 LBO పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. డిగ్రీతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. TGలో 88, APలో 5 పోస్టులు ఉన్నాయి. వయసు 20 -30 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్క్రీనింగ్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News November 21, 2025

NZB: ఎన్నికల సాధారణ పరిశీలకునిగా శ్యాంప్రసాద్ లాల్

image

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం NZB జిల్లాకు ఎన్నికల పరిశీలకులను నియమించిందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాకు ఎన్నికల సాధారణ పరిశీలకునిగా వెనుకబడిన తరగతుల సంక్షేమ పాఠశాలల ప్రత్యేక అధికారి జీవీ.శ్యాంప్రసాద్ లాల్‌ను, ఎన్నికల వ్యయ పరిశీలకులుగా KMR జిల్లా ఆడిట్ అధికారి జె.కిషన్ పమర్‌ను నియమించినట్లు పేర్కొన్నారు.