News November 19, 2025
ఏపీలో MSME ఎకోసిస్టమ్ బలోపేతానికి సహాయం పెంచండి: మంత్రి

ఏపీలోని MSME రంగం అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై కేంద్రంతో చర్చలు జరిగాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర MSME మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి & అభివృద్ధి కమిషనర్ డాక్టర్ రజనీష్ను మంగళవారం కలిశారు. రాష్ట్రంలో అమలవుతున్న MSME ప్రాజెక్టులు, వాటి పురోగతి, అవసరమైన సహాయంపై వివరించానని, ఎకోసిస్టమ్ను బలోపేతం చేయడానికి కేంద్రం నుంచి అందే సహాయాన్ని పెంచాలని కోరినట్లు తెలిపారు.
Similar News
News March 17, 2026
ఇరాన్ సుప్రీంలీడర్ రష్యాలో ఉన్నారా?

US, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్రంగా <<19366915>>గాయపడినట్లు <<>>వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో రష్యా మిలిటరీ విమానంలో రహస్యంగా ఆయన్ను మాస్కో తరలించారని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. అక్కడ విజయవంతంగా మొజ్తబాకు సర్జరీ చేసినట్లు కథనాల్లో పేర్కొంది. మరోవైపు సుప్రీంలీడర్ క్షేమంగానే ఉన్నారని ఇరాన్ డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ ఇస్మాయిల్ తెలిపారు. ఎక్కడ ఉన్నారనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
News March 17, 2026
ADB: డీఈఈసెట్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తుల ఆహ్వానం!

రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed) కోర్సుల్లో ప్రవేశానికి డీఈఈసెట్ నోటిఫికేషన్ విడుదలైందని డైట్ ప్రిన్సిపల్ అబ్దుల్ హై తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్ 15 వరకు గడువు ఉందన్నారు. ప్రవేశ పరీక్షలు మే 21, 22 తేదీల్లో ఆన్లైన్ విధానంలో జరుగుతాయని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ deecet.cdse.telangana.gov.inను సంప్రదించాలని ఆయన కోరారు.
News March 17, 2026
సంగారెడ్డి: పిల్లలను ఈతకు పంపవద్దు: ఎస్పీ

ఒంటిపూట బడులు ప్రారంభమైన నేపథ్యంలో పిల్లలను ఈతకు పంపవద్దని ఎస్పీ పారితోష్ పంకజ్ సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. చెరువులు కుంటల వద్ద పిల్లలకు లోతు తెలియకపోవడంతో మునిగిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. తల్లిదండ్రుల సంరక్షణలోనే పిల్లలకు ఈత నేర్పించాలని సూచించారు. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు.


