News April 13, 2024
జహీరాబాద్: విధులు నిర్వర్తించే చోటే ఉద్యోగులకు ఓటు

ఎన్నికల సంఘం తీసుకున్న కీలక నిర్ణయం ద్వారా ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసే పోలింగ్ కేంద్రంలోనే ఓటు వేసే వెసులుబాటు కల్పించింది. ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్(EDC)తో ఎన్నికల విధులు నిర్వర్తించే పోలింగ్ కేంద్రం నుంచే ఓటు వేసే అవకాశం రావడంతో పోస్టల్ బ్యాలెట్ తిప్పలు తప్పనున్నాయి. జహీరాబాద్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడ డ్యూటీ చేసిన ఈడీసీతో ఓటు వేయవచ్చు.
Similar News
News March 11, 2026
ఫైల్ క్లియరెన్స్ వేగవంతం చేయాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మంగళవారం కలెక్టరేట్లోని వివిధ శాఖల సెక్షన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఫైల్ క్లియరెన్స్ వేగవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో స్వచ్ఛత, పరిశుభ్రత పనులను తనిఖీ చేసి నిరుపయోగ వస్తువులు, పరికరాలను తొలగించాలని ఆదేశించారు.
News March 10, 2026
అవయవ మార్పిడి పాలసీపై మంత్రి సమీక్ష

ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో అవయవ మార్పిడి చట్టం(THOTA) పాలసీ రూపకల్పన, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలుపై మంత్రి దామోదర్ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అవయవ దానాలను ప్రోత్సహించే విధంగా విధానాలను సరళీకృతం చేయాలని, చికిత్స ఖర్చులు సామాన్యులకు అందుబాటులో ఉండేలా ధరల నియంత్రణ చేపట్టాలని సూచించారు. అవయవ మార్పిడి చికిత్సలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలని మంత్రి తెలిపారు.
News March 10, 2026
‘మినిట్ టు మినిట్’ ప్రణాళికను సిద్ధం చేయాలి: కలెక్టర్

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మార్చి 12న ప్రజాప్రతినిధులకు నిర్వహించనున్న శిక్షణపై కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులతో సమీక్షించారు. సీఎస్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆమె మాట్లాడుతూ.. శిక్షణకు సంబంధించి ‘మినిట్ టు మినిట్’ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు, కౌన్సిలర్లకు అవగాహన కల్పించాలని, పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.


