News November 19, 2025

నేటి సామెత.. ‘అదునెరిగి సేద్యం, పదునెరిగి పైరు’

image

సమయం చూసి వ్యవసాయం చేయాలి. అంటే, వాతావరణ పరిస్థితులు, భూమి స్వభావం, నీటి లభ్యత వంటి అంశాలను పరిశీలించి సాగును ప్రారంభించాలి. భూమికి, వాతావరణానికి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే పంటను వెయ్యాలి. సమయం దాటితే పంట చేతికి రాదు, శ్రమ కూడా వృథా అవుతుంది. అలాగే ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే సమయాన్ని సరిగ్గా అంచనా వేసి, సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పడం ఈ సామెత ఉద్దేశం.

Similar News

News March 22, 2026

పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపకండి: CM

image

TG: పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపాలనే మోజు నుంచి తల్లిదండ్రులు బయటకు రావాలని CM రేవంత్ సూచించారు. ‘వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభిస్తున్నాం. ఇవి నర్సరీ నుంచి ప్రారంభం అవుతాయి. పాలు, బ్రేక్‌ఫాస్ట్ కూడా అందిస్తాం. ప్రైవేట్ కంటే గవర్నమెంట్ టీచర్లే ప్రతిభావంతులు. అన్ని ప్రభుత్వ స్కూళ్లను ప్రక్షాళన చేస్తాం. అందుకే విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్నా’ అని సిద్దిపేటలో తెలిపారు.

News March 22, 2026

ఘోరం.. తల్లి ముందే మైనర్ బాలికను..

image

నాసిక్ (MH) జ్యోతిషుడు <<19434630>>అశోక్ ఖరత్<<>> మైనర్లనూ వదల్లేదు. తల్లి ముందరే ఓ పాపను అసభ్యంగా తాకుతూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ప్రతికూల శక్తిని తొలగిస్తానంటూ టీషర్ట్‌ను పైకి ఎత్తమని కడుపు, ఛాతీని ఇంటర్నెట్ కేబుల్ టెస్టర్‌తో రుద్దాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆ వీడియోను NCP (శరద్ పవార్ వర్గం) నేత రూపాలి రిలీజ్ చేశారు. కాగా అశోక్ పెన్ డ్రైవ్‌లో 100కు పైగా వీడియోలను పోలీసులు గుర్తించారు.

News March 22, 2026

24 ఏళ్లలో మోదీ ఒక్క సెలవు కూడా తీసుకోలేదు: అమిత్ షా

image

అత్యధిక రోజులు సేవలు అందించిన ప్రభుత్వాధినేతగా ప్రధాని మోదీ <<19447588>>రికార్డ్<<>> నెలకొల్పిన నేపథ్యంలో కేంద్రహోంమంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. 24ఏళ్లలో మోదీ ఒక్క సెలవు కూడా తీసుకోలేదని.. ఇది ప్రజాసేవ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతకు నిదర్శనం అని అన్నారు. ఇందుకే ప్రజలు ఆయనను మూడు సార్లు గుజరాత్ సీఎం, మూడు సార్లు భారత ప్రధానిని చేశారని తెలిపారు. మోదీ హయాంలో భారత్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.