News November 19, 2025
2027 ఆగస్టులో బుల్లెట్ రైలు పరుగులు

దేశంలో 2027 ఆగస్టులో తొలి బుల్లెట్ రైలు ప్రారంభమవుతుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. తొలి దశలో గుజరాత్లోని సూరత్, వాపి మధ్య 100 కి.మీ. మేర నడపనున్నట్లు చెప్పారు. మొత్తం ప్రాజెక్టు 2029లో పూర్తవుతుందని అన్నారు. ముంబై-అహ్మదాబాద్ కారిడార్ అందుబాటులోకి వస్తే 2 గంటల్లోనే జర్నీ పూర్తి అవుతుందని అన్నారు. ఇటీవల ప్రధాని <<18307759>>పర్యటన <<>>తర్వాత అశ్వినీ వైష్ణవ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Similar News
News March 8, 2026
ఈరోజైనా అభి’షేక్’ చేస్తాడా?

T20 WCలో నిరాశ పరుస్తున్న భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఇవాళ NZతో ఫైనల్లోనైనా చెలరేగి ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫామ్లో ఉన్న శాంసన్కు తోడు అభి రాణిస్తే బ్యాటింగ్లో INDకి తిరుగుండదు. నిన్న ప్రాక్టీస్ టైమ్లో అభితో హెడ్ కోచ్ గంభీర్ 40 నిమిషాలపాటు మాట్లాడినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. కాగా ఈ WCలో ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ 7 ఇన్నింగ్స్లలో 89 రన్స్ మాత్రమే చేశారు. ఇందులో 3 డకౌట్లు ఉన్నాయి.
News March 8, 2026
WBలో ప్రొటోకాల్ వివాదం.. అమిత్ షా, CBN ఏమన్నారంటే

ప.బెంగాల్లోని TMC ప్రభుత్వం తమ అరాచక ప్రవర్తనతో అథఃపాతాళానికి దిగజారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. ‘ప్రోటోకాల్ పాటించకుండా రాష్ట్రపతిని అవమానించారు. <<19322594>>ఈ ఘటన<<>> దేశానికి, ప్రజాస్వామ్యానికి అవమానం’ అని ట్వీట్ చేశారు. రాష్ట్రపతిని అవమానించేలా WB ప్రభుత్వం వ్యవహరించడం దురదృష్టకరమని, ఈ ఘటన బాధ కలిగించిందని AP CM CBN తెలిపారు. రాష్ట్రపతి పట్ల గౌరవంతో మెలగాలన్నారు.
News March 8, 2026
చరిత్రలో ఈరోజు (మార్చి 8)

1897: చిత్రకారుడు దామెర్ల రామారావు జననం
1917: విద్యుత్తు రంగ నిపుణుడు నార్ల తాతారావు జననం
1989: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ జననం
1993: చిలకలూరిపేట బస్సు దహనం ఘటనలో 23 మంది మృతి
2012: సినీ నటి రాధాకుమారి మరణం
☛ అంతర్జాతీయ మహిళా దినోత్సవం


