News November 19, 2025

మద్యం తాగాలంటూ ఏయూ హాస్టల్లో బెదిరింపులు

image

దేశంలోనే ప్రఖ్యాతి చెందిన ఏయూ పరువు రోజు రోజుకూ దిగజారుతోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఏయూలో నిన్న జరిగిన ఓ కార్యక్రమానికి కలెక్టర్ హరేంధిర ప్రసాద్, CP శంఖబ్రత బాగ్చీ వచ్చారు. ఈ క్రమంలో ఓ విదేశీ విద్యార్థి వారి వద్దకు వెళ్లి తమ హాస్టల్లో కొంతమంది విద్యార్థులు మద్యం తాగాలంటూ బలవంతం చేస్తున్నారని ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని కమిటీ వేసి చర్యలు తీసుకుంటామని VC రాజశేఖర్ తెలిపారు.

Similar News

News March 24, 2026

మార్కాపురం నూతన కలెక్టర్ బాధ్యతలకు తాత్కాలిక బ్రేక్

image

అనివార్య కారణాల వలన బుధవారం మార్కాపురం నూతన జిల్లాకు కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాల్సిన విజయ సునీత జాయినింగ్‌ తాత్కాలికంగా వాయిదా పడినట్లు జిల్లా పౌర సంబంధాల అధికారి తెలియజేశారు. ముందుగా రేపు మార్కాపురం కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపిన అధికారులు.. ఆమె జాయినింగ్ వాయిదా పడినట్లు వివరించారు. మళ్లీ బాధ్యతల స్వీకరణ ఎప్పుడు అనే విషయాన్ని త్వరలో తెలియజేస్తామన్నారు.

News March 24, 2026

మార్కాపురం నూతన కలెక్టర్ బాధ్యతలకు తాత్కాలిక బ్రేక్

image

అనివార్య కారణాల వలన బుధవారం మార్కాపురం నూతన జిల్లాకు కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాల్సిన విజయ సునీత జాయినింగ్‌ తాత్కాలికంగా వాయిదా పడినట్లు జిల్లా పౌర సంబంధాల అధికారి తెలియజేశారు. ముందుగా రేపు మార్కాపురం కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపిన అధికారులు.. ఆమె జాయినింగ్ వాయిదా పడినట్లు వివరించారు. మళ్లీ బాధ్యతల స్వీకరణ ఎప్పుడు అనే విషయాన్ని త్వరలో తెలియజేస్తామన్నారు.

News March 24, 2026

శ్రీకాకుళం: అమిత్ షాతో రామ్మోహన్ నాయుడు భేటీ

image

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంగళవారం కేంద్ర మంత్రి, జిల్లా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు భేటీ అయ్యారు. శ్రీకాకుళం నగరంలోని నాగావళి పరివాహక ప్రాంతంలో రక్షణ గోడలు నిర్మించాలని కోరారు. జిల్లాలో పలుచోట్ల ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్ ఆవశ్యకతను ఆయనకు వివరించారు. శ్రీకాకుళం మండలం పెద్దగనగళ్లవానిపేట వద్ద నాగావళి నది సముద్రంలో కలిసే చోట తీరం కోతకు గురౌతుందని అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు.