News November 19, 2025
అఖండ పల్నాడు రారాజు అనుగు రాజు యాదవ్ గురించి తెలుసా..?

పల్నాడు చరిత్ర అనగానే బ్రహ్మనాయుడు, నాగమ్మ గుర్తుకొస్తారు. అయితే అఖండ పల్నాడును పరిపాలించిన అనుగురాజు యాదవ్ పాత్ర కీలకమైనది. ఈయనకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య కుమారుడు మలిదేవుడు మాచర్ల రాజధానిగా బ్రహ్మనాయుడు మంత్రిగా, చిన్న భార్య కుమారుడు నలగామ రాజు గురజాల రాజధానిగా నాగమ్మ మంత్రిగా పరిపాలించారు. దాయాదుల మధ్య జరిగిందే పల్నాటి యుద్ధం అనుగరాజ గుర్తుగా పిడుగురాళ్లలో ఆయన విగ్రహం ఏర్పాటు చేశారు.
Similar News
News March 19, 2026
ఖమ్మం: ఉద్యోగం లేని వారికి మంచి ఛాన్స్

ఖమ్మం జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు DYSO సునీల్ రెడ్డి తెలిపారు. కంప్యూటర్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో 3 నెలల శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి గలవారు ఆధార్, విద్యార్హత పత్రాలతో నేరుగా కార్యాలయంలో సంప్రదించాలని, వివరాలకు 99482 07271 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు.
News March 19, 2026
దివ్యాంగులతో సెల్ఫీ దిగిన కలెక్టర్ లక్ష్మీశా

విజయవాడలో బుధవారం దివ్యాంగ శక్తి పథక ప్రారంభోత్సవంలో కలెక్టర్ లక్ష్మీశా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా RTC బస్ ఎక్కిన ఆయన దివ్యాంగులతో సెల్ఫీ దిగారు. ఈ పథకంతో దివ్యాంగుల సాధికారతకు కొత్త ఊపిరి లభిస్తుందని, దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు.
News March 19, 2026
కడప: నేటి ఇంటర్ పరీక్షలకు 259 మంది విద్యార్థులు డుమ్మా.!

కడప జిల్లాలో బుధవారం సెకండ్ ఇంటర్ కెమిస్ట్రీ పేపర్ -2 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 60 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలను అధికారులు నిర్వహించారు. నేడు జరిగిన పరీక్షలకు 12,145 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా.. 11,886 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 98% విద్యార్థులు పరీక్షలు రాశారు. 259 మంది విద్యార్థులు పరీక్షలు రాయలేదు.


