News November 19, 2025

అఖండ పల్నాడు రారాజు అనుగు రాజు యాదవ్ గురించి తెలుసా..?

image

పల్నాడు చరిత్ర అనగానే బ్రహ్మనాయుడు, నాగమ్మ గుర్తుకొస్తారు. అయితే అఖండ పల్నాడును పరిపాలించిన అనుగురాజు యాదవ్ పాత్ర కీలకమైనది. ఈయనకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య కుమారుడు మలిదేవుడు మాచర్ల రాజధానిగా బ్రహ్మనాయుడు మంత్రిగా, చిన్న భార్య కుమారుడు నలగామ రాజు గురజాల రాజధానిగా నాగమ్మ మంత్రిగా పరిపాలించారు. దాయాదుల మధ్య జరిగిందే పల్నాటి యుద్ధం అనుగరాజ గుర్తుగా పిడుగురాళ్లలో ఆయన విగ్రహం ఏర్పాటు చేశారు.

Similar News

News March 23, 2026

పెద్దపల్లి: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కట్టుదిట్టంగా అమలు చేయాలి’

image

‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని ప్రతి శాఖకు సంబంధించిన అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. సోమవారం ఆయన అదనపు కలెక్టర్ వేణుతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్ ఫైల్స్ పరిష్కారంలో ఆశించిన స్థాయిలో పురోగతి లేదన్నారు. జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో విద్యాసంస్థలను తనిఖీ చేస్తూ, పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేయాలని సూచించారు.

News March 23, 2026

మిల్లింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి: ASF కలెక్టర్

image

మిల్లింగ్ ప్రక్రియ వేగవంతం చేసి నాణ్యత ప్రమాణాలు పాటించాలలని ASF జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ధాన్యాన్ని సమయానికి మిల్లింగ్ చేసి, నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని, మిల్లింగ్ ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం, నిర్లక్ష్యం అనుమతించరాదని ఆమె ఆదేశించారు. ప్రభుత్వానికి నష్టం రాకుండా చూడాలన్నారు.

News March 23, 2026

మిల్లింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి: ASF కలెక్టర్

image

మిల్లింగ్ ప్రక్రియ వేగవంతం చేసి నాణ్యత ప్రమాణాలు పాటించాలలని ASF జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ధాన్యాన్ని సమయానికి మిల్లింగ్ చేసి, నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని, మిల్లింగ్ ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం, నిర్లక్ష్యం అనుమతించరాదని ఆమె ఆదేశించారు. ప్రభుత్వానికి నష్టం రాకుండా చూడాలన్నారు.